కులకచర్ల, సెప్టెంబర్ 9: మండల కేంద్రానికి 4కిలో మీటర్ల దూరంలో ఉన్న పీరంపల్లి పంచాయతీ అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కుతున్నది. పీరంపల్లిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పనులు పూర్తిస్థాయిలో నిర్వహించడంతో గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నది. పల్లెల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులు, కేటాయిస్తున్న నిధులతో గ్రామాల్లో సమస్యలు పరిష్కారమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీకి కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది.
గ్రామంలో అభివృద్ధి పనులు
మిషన్ భగీరథ పథకంలో ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పించారు. 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం, సీసీ రోడ్లు, మురుగునీటి కాల్వలు నిర్మిస్తున్నారు. గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో డంపింగ్ యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, మురుగు నీటి కాల్వల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం, ఇంటింటికీ నల్లా ఏర్పాటు చేశారు.
రోజూ పారిశుధ్య పనులు..
పీరంపల్లిలో రోజూ పరిసరాల పరిశుభ్రత నిర్వహిస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్తో ప్రతి వీధిలో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్నారు. ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలు పంపిణీ చేశారు. తడి, పొడి చెత్తను వేరుగా చేసి ట్రాక్టర్లో వేయాలని అవగాహన కల్పించారు.
మురుగునీటి కాల్వల ఏర్పాటు
గ్రామంలో మురుగునీటి కాల్వలను ఏర్పాటు చేసి పారిశుధ్య పనులు చేపట్టా రు. ఇందుకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. మురుగునీరు ని ల్వ ఉండకుండా వీధుల్లో మురు గు నీటి కాల్వలు నిర్మిస్తున్నారు.
మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం
గ్రామంలో పూర్తిస్థాయిలో ఇం కుడు గుంతలు, మరుగుదొడ్ల ని ర్మాణం చేపట్టారు. బహిరంగ మల, మూత్ర విసర్జనకు ఫైన్ వేసే లా నిబంధనలు అమలుచేస్తున్నారు.
గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం
గ్రామస్తుల సహకారంతో పీరంపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పంచాయతీకి పల్లె ప్రగతి ద్వారా వివిధ అభివృద్ధి పనులు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నది. ఇప్పటికే 90శాతం పనులు పూర్తిచేశాం.
సమస్యల పరిష్కారానికి చర్యలు
పీరంపల్లిలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. రోజూ పంచాయతీ సిబ్బంది ద్వారా పారిశుద్ధ్యం పనులు నిర్వహిస్తున్నాం. మురుగునీటి కాల్వలను శుభ్రం చేయడంతో గ్రామంలో దోమల బాధ చాలావరకు తప్పింది. గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాం. – విజయ్కుమార్, పంచాయతీ కార్యదర్శి, పీరంపల్లి
పల్లె ప్రగతికి ప్రభుత్వం కృషి
పల్లె ప్రగతి కార్యక్రమంలో పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధు లు కేటాయిస్తున్నది. ప్రభుత్వం కేటాయించిన నిధులతో గ్రా మంలో అభివృద్ధి పనులు జ రుగుతున్నాయి. ప్రభుత్వ పథకాలు గ్రామంలో ప్రతి ఒక్కరికి అందుతున్నాయి.