కవాడిగూడ : రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను అదేశించారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్ పరిధిలోని కవాడిగూడ ప్రధాన రహదారిలో తాగునీటి పైప్లైన్లు వేసిన ప్రాంతాలలో జరుగుతున్న రోడ్డు ప్యాచ్వర్క్ నిర్మాణ పనులను ఆయన డివిజన్ నాయకులతో కలసి పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భోలక్పూర్ డివిజన్లో తాగునీటి, డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణ పనులను రూ. 20 కోట్లతో చేపట్టామని, అందులో భాగంగా రోడ్డు ప్యాచ్వర్క్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఆయన అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో భోలక్పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, మాజీ అధ్యక్షుడు మహ్మద్ అలీ, ఉపాధ్యక్షుడు ఏ. శంకర్ గౌడ్, సీనియర్ నాయకుడు షరీపోద్దీన్, జునేద్ బాగ్ధాది, బింగి నవీన్కుమార్, ప్రవీణ్ కుమార్, గోవింద్ రాజ్, మక్బూల్, ఉమాకాంత్, పబ్బ కృష్ణ, ఆరీపోద్దీన్, కళ్యాణ్, ఆర్. శ్రీనివాస్, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.