జడ్చర్ల రూరల్, జనవరి 17 : మండలంలోని కొడ్గల్ గ్రామంలో చేపట్టిన ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. సోమవారం భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థినులకు కార్పొరేట్స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని హంగులతో భవనాలను నిర్మిస్తున్నదని తెలిపారు. భవన నిర్మాణ పనులపై అధికారులు పర్యవేక్షణ పెంచి నాణ్యత లోపించకుండా చూడాలని సూచించారు.
బాధితుడికి పరామర్శ
జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ దవాఖానలో చికిత్స పొందుతున్న నల్లకుంటతండావాసి కిషన్నాయక్ను జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య పరామర్శించారు. కార్యక్రమంలో నవీన్రెడ్డి, ఇంతియాజ్ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆంజనేయులు, పీఏసీసీఎస్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి, రమేశ్, నయ్యూం పాల్గొన్నారు.