ఎర్రగడ్డ: వనరులను సద్వినియోగం చేసుకోవటంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ ప్రభాత్నగర్లో రూ.46 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రస్థానానికి చేర్చారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయానికి వస్తే నాణ్యతకు పెద్దపీట వేయటంతో పాటు సకాలంలో పనులు పూర్తయ్యేలా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు.
ప్రభాత్నగర్లో చిన్న చిన్న సమస్యలను బస్తీ నేతలు తన దృష్టికి తెచ్చారని.. వాటన్నింటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా శాఖల అధికారులకు సూచిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్బేగం, మాజీ కార్పొరేటర్ మహ్మద్షరీఫ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు డి.సంజీవ, నేతలు గంట మల్లేష్, రాము, అజీమ్, కల్యాణి, రాజు, యాదగిరి, బస్తీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు.