శంషాబాద్ రూరల్ : ప్రముఖ క్రీడాకారిణీ, టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత పీవీ సింధు శంషాబాద్ మండలం నర్కూడ అమ్మపల్లి (సీతారామచంద్రస్వామి) దేవాలయాన్నిదర్శించుకున్నారు. బుధవారం సాయంత్రం కుటుంబ సమేతంగా వచ్చిన సింధు అమ్మపల్లి దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సింధుకు అర్చకులు ఆలయం విశిష్టతను వివరించారు.
మినీ భద్రాచలంగా పిలవబడే అమ్మపల్లి దేవాలయంలో నిర్వహించే కార్యక్రమాలు తెలియజేశారు. హైదరాబాద్ సమీపంలో చారిత్రాత్మక దేవాలయం ఉన్నట్లు తెలియడంతో స్వామివారిని దర్శించుకోవడం కొసం వచ్చినట్టు సింధు తెలిపారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.