రేవల్లి, జనవరి 14 : దేశానికి తాను పెద్ద చౌకీదార్గా చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా.. అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించా రు. శుక్రవారం వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని కే శంపేట, చెన్నారం గ్రామాల పరిధిలోని ఎంజే-1 కాలువలను పరిశీలించి కృష్ణా జలాలకు స్థానిక నాయకులతో కలిసి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం పంట చేతికి వచ్చిన సమయం కాబట్టే సంక్రాంతి రైతుల పండుగని, అన్నదాతలు సంతోషంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్నారు. రైతుల గురించి అనుక్షణం పనిచేసే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ పల్లెలు నేడు సుభిక్షంగా ఉన్నాయని, అన్ని రంగాల అధికారులు తమ తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. గ్రామ సీమలు గతంలో కరువుకు నిలయంగా, అపరిశుభ్ర వాతావరణంతో నిండి ఉండేవని, నేడు మౌలిక సదుపాయాలతో పరిశుభ్రంగా ఉన్నాయని గుర్తుచేశారు. గత పండుగలు ఎన్నో ఇబ్బందులతో నిర్వహించుకునేవాళ్లమని ఇప్పుడు ఆ పరిస్థితి పోయిందని, గ్రామీణ ప్రాంతాలకు అడుగుపెడుతుండగానే ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కు పాలన కనిపిస్తుందని, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నూతన రహదారులు, మౌలిక సదుపాయాలతో దర్శనమిస్తున్నాయని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తే వారు ఆదరిస్తారని మంత్రి పేర్కొన్నారు.
పేద విద్యార్థికి చేయుత..
చెన్నారం గ్రామానికి చెందిన పేదవిద్యార్థి కావేరికి మంత్రి నిరంజన్రెడ్డి పైచదువులకు ఆర్థిక చేయూతనందించారు. శుక్రవారం గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను ప్రారంభించారు. గ్రామానికి చెందిన కావేరి ముగ్గు ఆకట్టుకోవడంతో వివరాలు తెలుకున్నారు. తనకు పైచదువులు చదవాల్సి ఉన్నా కుటుంబ సభ్యులు పెండ్లి చే యాలని ఏర్పాట్లు చేస్తున్నారని మంత్రికి తెలుపడంతో తల్లితో మాట్లాడారు. కావేరి చదువుకు తాను సహకరిస్తానని, పెండ్లి నిర్ణయాన్ని విరమించుకోవాలని మంత్రి సూచించారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని సర్పంచ్ రమేశ్యాదవ్ను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీ పీ సేనాపతి, జెడ్పీటీసీ భీమయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నారాయణరెడ్డి, మార్కెట్కమిటీ సభ్యుడు సురేశ్, సర్పంచులు సునీల్కుమార్, నరేందర్రెడ్డి, గోపాల్రావు, ఎంపీటీసీలు కుర్మతిరెడ్డి, శ్రీశైలం యాదవ్, నాయకులు పాల్గొన్నారు
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి..
వనపర్తి, జనవరి 14: సంక్రాంతి పండుగ సందర్భంగా శుక్రవారం మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి టెలీకాన్ఫరెన్స్లో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఉమ్మడి పాలమూ రు జిల్లా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రై తులు, ప్రజలు, పార్టీ నేతలు, అభిమానులు, ఉద్యోగులకు పండుగ శుభాకాంక్షలను తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.