మణుగూరు టౌన్, డిసెంబర్ 2: నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న ప్రగతిని ప్రజల వద్దకు వెళ్లి వివరించాల్సిన బాధ్యత బీ(టీ)ఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులదేనని ఆ పార్టీ నేత, పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు పల్లె పల్లెకూ అందేలా చూడాలని కోరారు. ఇందుకోసం సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వస్తుంటాయని, బీ(టీ)ఆర్ఎస్ మాత్రం ఎల్లవేళలా ప్రజల్లోనే ఉంటూ వారి కష్ట సుఖాలను పాలుపంచుకుంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
సారపాక, డిసెంబర్ 2: మండల అభివృద్ధికి ఎమ్మెల్యే రేగా కాంతారావు పెద్ద మొత్తంలో నిధులు తీసుకొస్తున్నారని జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు అన్నారు. వారు శుక్రవారం లక్ష్మీపురంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. మండలవ్యాప్తంగా అంతర్గత రహదారులు సీసీ రోడ్లుగా మార్చేందుకు, ఇతరత్రా పనులకు నిధులను మంజూరు చేయించారని చెప్పారు. ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. బీ(టీ)ఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, నాయకులు వల్లూరిపల్లి వంశీకృష్ణ, జక్కం సుబ్రమణ్యం, గోనెల నాని, భూపెల్లి నర్సింహారావు, సాదిక్, సాబీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
పినపాక, డిసెంబర్ 2: మండల అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరైనట్లు బీ(టీ)ఆర్ఎస్ మండల అధ్యక్షుడు పగడాల సతీష్రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమరవరం-కొత్తూరు-సామర్లకోట బీటీ రోడ్డుకు రూ 2.5 కోట్లు, చినరాజుపేట-మల్లారం మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ.60 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. వీటిని మంజూరు చేయించిన ఎమ్మెల్యే రేగా కాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, పీఏసీఎస్ చైర్మన్ వర్మ, ఆత్మ చై ర్మన్ భద్రయ్య, రైతు బంధు సమితి మండల కన్వీనర్ దొడ్డా శ్రీనివాస్రెడ్డి, నాయకులు వా సుబాబు, బుల్లిబాబు, సత్తిబాబు, యగ్గడి శ్రీరాం పాల్గొన్నారు.
అశ్వాపురం, డిసెంబర్ 2: మండల అభివృద్ధికి రూ.19.30 కోట్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ప్రజల తరఫున జడ్పీటీసీ సభ్యురాలు సూదిరెడ్డి సులక్షణ, బీ(టీ)ఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. వారు శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అశ్వాపురం-చింతిర్యాల క్రాస్ రోడ్ మార్గంలో సైడ్ డ్రైన్, సెంట్రల్ లైటింగ్కు రూ.4కోట్లు, తుమ్మలచెరువు లోతువాగు బ్రిడ్జి నిర్మాణానికి రూ.5కోట్లు, మొండికుంట మెయిన్ రోడ్డుకు ఇరువైపులా సైడ్డ్రైన్ కోసం రూ.1.51కోట్లు, నెల్లిపాక రాళ్లవాగు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.80కోట్లు, గొందిగూడెం ఇసుకవాగు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.7కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కంచుగట్ల వీరభద్రం, వెన్న అశోక్కుమార్, జాలే రామకృష్ణారెడ్డి, సూదిరెడ్డి గోపిరెడ్డి, గద్దల రామకృష్ణ, రాసాల రమేష్, కోరెం రామారావు, మడకం సాధు, సోయం శ్రీను, పిట్టా శ్రీను, బొర్రా శ్రీను, జూపెల్లి కిరణ్, గజ్జి లోహిత్, మల్లె సంపత్ తదితరులు పాల్గొన్నారు.
అశ్వాపురం, డిసెంబర్ 2: మండలంలోని తురుములగూడెం పంచాయతీ కొమ్ముగూడెం గ్రామంలో బీ(టీ)ఆర్ఎస్ బూత్ స్థాయి ఇన్చార్జ్లుగా కోల భాస్కర్, బొజ్జ కృష్ణ, సోందె రమేష్ను వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం శుక్రవారం నియమించారు. ఆయన మాట్లాడుతూ.. ఒక్కో బూత్లో 100 మంది ఓటర్లు ఉంటారని చెప్పారు. ఇన్చార్జిలు తమ బూత్లోని ప్రజల సమస్యలను పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నాయకు లు షేక్ నయీమ్, ఊకే రామయ్య, కోల రామారావు, కుంజా శ్రీను, రాంబాబు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
కరకగూడెం, నవంబర్ 2: మండలంలోని వివిధ గ్రామా ల్లో పార్టీ బూత్ ఇన్చార్జులు నియమితులయ్యారు. సమత్మోతె- సుతారి నాగేష్, కొమరం సురేష్, గొ ల్లగూడెం- ఇర్ప విజయ్కుమార్ (సర్పంచ్), తుమ్మలగూడెం- సావిత్రి (సర్పంచ్), సారయ్యను నాయకులు నియమించారు.
బూర్గంపహాడ్, డిసెంబర్ 2: మండలంలోని నాగినేనిప్రో లు రెడ్డిపాలెం గ్రామ ముస్లిం మైనార్టీ, యువజన కమిటీలను శుక్రవారం నాయకులు షేక్ సాదిక్పాషా, గుల్మహ్మద్ నియమించారు. మైనార్టీ కమిటీ అధ్యక్షుడిగా మహ్మద్ సత్తార్, ఉపాధ్యక్షుడిగా షేక్ అబ్బాస్, ప్రధాన కార్యదర్శిగా షేక్ ఇమామ్సాబ్, కోశాధికారిగా షేక్ యాకూబ్పాషా, యువజన కమిటీ అధ్యక్షుడిగా షేక్ శారూఫ్, ఉపాధ్యక్షుడిగా షేక్ అఫ్రోజ్, ప్రధాన కార్యదర్శిగా షేక్ వాజిద్, కోశాధికారిగా షేక్ ఫయాజ్ను నియమించారు. నాయకులు కాటం వెంకట్రామిరెడ్డి, జక్కం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.