మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామాల అభివృద్ధి స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాకారమవుతున్నది. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలను పట్టణాలకే ఆదర్శంగా నిలిచేలా ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది. పల్లెల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అని భావించిన సీఎం కేసీఆర్ గ్రామాల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. పల్లె ప్రగతి ద్వారా ప్రతి నెలా నిధులను కేటాయిస్తుడడంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నది.
గ్రామంలో చేపట్టిన నిర్మాణాలు..
మండలంలోని నాంచారిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకుపోతున్నది. గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో 1,034 మంది ఉండగా 960 మంది ఓటర్లు ఉన్నారు. పల్లె ప్రగతిలో మంజూరైన నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం పనులు చేపట్టారు. గ్రామస్తుల సహకారం, ప్రభుత్వ చేయూత, అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో మండలంలోని నాంచారిపేట ప్రభుత్వ విప్, స్థానిక ఎ మ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సహకారంతో సర్పంచ్ పైళ్ల వినోద అన్ని ప్రభుత్వ పథకాలను గ్రామంలో అమలు చేస్తున్నారు. గ్రామాభివృద్ధికి ప్రతి నెలా రూ.లక్షా 61 వేలు మం జూరు చేస్తుండడంతో నిధులను సక్రమంగా వినియోగించుకుంటూ గ్రా మా న్ని ప్రగతి వైపు తీసుకెళ్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ప్రజా ప్రతినిధుల, గ్రామస్తుల సమన్వయంతో గ్రా మంలో రూ.12. 60 లక్షలతో వైకుంఠధామం, రూ.3.50 లక్షలతో డంపింగ్యార్డు, రూ.3.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, రూ.7లక్షలతో అండర్ గ్రౌం డ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. రూ.9.35 లక్షలతో ట్రాక్టర్ కొనుగోలు చేశారు. గ్రామ పంచాయతీ నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్తో ఇంటింటికీ చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తూ గ్రామ స్వచ్ఛతకు పాటుపడుతున్నారు. వైకుంఠధామం పనులు పూర్తి కావడంతోఅంతిమ సంస్కారాల కష్టాలు తీరాయి.
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం
గ్రామ శివారులోని పల్లె ప్రకృతి వనంలో 22 రకాల మొక్కలు నాటి సంరక్షిస్తుడడంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. 4 వేల మొక్కలతో ప్రకృతి వనం ఏర్పాటు చేసి పంచాయతీ కార్యదర్శి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా గ్రామ వీధుల్లో, రోడ్లకు ఇరువైపులా 1,426 మొక్కలు నాటడంతో ఏపుగా పెరిగి ప్రకృతి అందాన్ని ఇస్తున్నాయి.
అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి
పల్లె ప్రగతిలో గ్రామస్తులందరూ భాగస్వాములు కావడంతోనే మా గ్రామం అభివృద్ధి చెందింది. పల్లె ప్రగతి నిధులను సక్రమంగా వినియోగించుకుంటున్నాం. అధికారులు నిర్దేశించిన సమయంలో గ్రామంలో అన్ని పనులను పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం.
నిత్యం పర్యవేక్షిస్తున్నాం
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలను అనునిత్యం పర్యవేక్షిస్తున్నాం. సర్పంచ్, పాలకవర్గం ప్రగతి పనుల్లో మంచి సహకారం అందిస్తున్నారు. వైకుంఠధామం, డంపింగ్యార్డు పనులు చకచకా జరిగాయి. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం తప్పనిసరి. నాంచారిపేటలో ప్రజాప్రతినిధులకు ప్రజలు పూర్తి సహకారం అందిస్తున్నారు.
-వీరస్వామి, ఎంపీడీఓ, మోటకొండూర్