ఆత్మకూరు(ఎం), మార్చి 31 : గత ప్రభుత్వాల పాలనలో సర్కారు దవాఖానల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాలకు ఉచితంగా వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా ఆరోగ్య కేంద్రాల్లో ఆహ్లాదాన్ని పంచేలా మొక్కలు నాటి పెంచుతున్నారు. ఆత్మకూరు(ఎం)లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది అందిస్తున్న సేవలతోపాటు ప్రభుత్వం చేపట్టిన హరితహారం, పల్లె ప్రగతిలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షిస్తుండడంతో ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచు తున్నాయి. రోజూ పారిశుధ్య పనులు చేపట్టడంతో ఆవరణంతా పరిశుభ్రంగా దర్శనమిస్తున్నది.
నిత్యం వైద్యం కోసం ఇక్కడికి వచ్చే వారంతా పచ్చదనంతో కనిపిస్తున్న ఆరోగ్య కేంద్రాన్ని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజూ పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు నాటిన మొక్కలకు నీళ్లు పోసి సంరక్షిస్తుండడంతో పీహెచ్సీ ఆవరణంతా ఆహ్లాదకరంగా మారింది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఆరోగ్య కేంద్రానికి రంగులు వేయించడంతో కొత్త శోభ సంతరించుకున్నది. ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తుండడంతో పాటు కేసీఆర్ కిట్టుతో ప్రసవాల సంఖ్య పెరిగింది.
– ప్రణీష, మండల వైద్యాధికారి, ఆత్మకూరు(ఎం)
మండల కేంద్రంలోని పీహెచ్సీ పచ్చదనంతోపాటు పరిశుభ్రంగా మారి ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఆరోగ్య కేంద్రం లోపలికి వెళ్లగానె నీడనిచ్చే చెట్లతోపాటు వివిధ రకాల పూల మొక్కలు దర్శనమిస్తున్నాయి. వైద్యం కోసం వచ్చే ప్రజలు చెట్ల నీడన సేద తీరుతున్నారు. ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి ప్రభుత్వ కృషి అభినందనీయం.
– మాద సత్తయ్యగౌడ్, ఆత్మకూరు(ఎం)