చొప్పదండి, ఏప్రిల్ 12: అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణను ఆరోగ్యవంతమైన రాష్ట్రంగానూ తీర్చిదిద్దడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో సోమవారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు రూ. 10.88 లక్షల విలువైన సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు సైతం కార్పొరేట్ వైద్యసేవలు అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వారికి ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తూ భరోసానిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, సర్పంచులు గుంట రవి, లావణ్య, సౌజన్య, కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బందారపు అజయ్కుమార్గౌడ్, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్లు గొల్లపల్లి శ్రావణ్కుమార్, గన్ను శ్రీనివాస్రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, నాయకులు మచ్చ రమేశ్, రాపెల్లి ఐలయ్య, మహేశుని మల్లేశం, యువరాజు తదితరులు పాల్గొన్నారు.
‘ఖరీదైన జైళ్లు’ నాటికకు జాతీయ బహుమతి
కమాన్చౌరస్తా, ఏప్రిల్ 12: జిల్లాకు చెందిన చైతన్య కళాభారతి కళాకారులు ప్రదర్శించిన ‘ఖరీదైన జైళ్లు’ నాటికకు జాతీయస్థాయిలో రెండో బహుమతి లభించిందని నాటిక దర్శకుడు, సంస్థ కార్యదర్శి మంచాల రమేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణంలో ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జరిగిన పైడా కౌషిక్ 15వ జాతీయ స్థాయి సాంఘిక నాటికల పోటీల్లో చైతన్య కళాభారతి కళాకారులు పాల్గొన్నారు. వారు ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకొని రెండో బహుమతి గెలుపొందడంతో పాటు వివిధ విభాగాల్లో ప్రశంసలు అందుకున్నట్లు రమేశ్ చెప్పారు. ఈ సందర్భంగా కళాకారులు అల్లకొండ కిషన్రెడ్డి, గద్దె ఉదయ్కుమార్, కొత్తకొండ సత్యనారాయణను పలువురు కళాకారులు ప్రత్యేకంగా అభినందించినట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మార్కెట్ల ‘బ్లడ్బాత్’: ఇన్వెస్టర్లలో ‘నెర్వస్’నెస్!
ఇంగ్లీషు పాట పాడిన చిలుక.. చూస్తే వావ్ అంటారు!