కవాడిగూడ : భక్తి భావనతోనే మానసిక ప్రశాశాంతత అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం తమిళనాడులోని ఆదిపరాశక్తి దేవాలయానికి వెళుతున్న భవానీ మాతా భక్తులు క్షేమంగా వెళ్లి రావాలని కోరుతూ ముషీరాబాద్ మహంకాళీ దేవాలయంలో భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ ప్రధాన పూజారీ వై. చంద్రమౌళి ఆధ్వర్యంలో భవానీ మాతా భక్తులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ విడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తితోనే ఆధ్యాత్మికత అని, మనసును ప్రశాంతంగా ఉంచుతుందని అన్నారు.
భక్తులు తమ మాల విరమణ ముగించుకొని క్షేమంగా రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ ఛైర్మన్ ఎయిర్టెల్ రాజు, అజయ్కుమార్, బల్లా ప్రశాంత్, నర్సింగరావు, పూజారీ వై. చంద్రమౌళి, మహిళలు పాల్గొన్నారు.