తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉమ్మడి మెదక్ జిల్లా రాత మారుతున్నది. సమైక్య రాష్ట్రంలో జిల్లా తీవ్ర వివక్షకు గురికాగా, ఇప్పుడు సీఎం కేసీఆర్ కృషితో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. టీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని రోడ్లకు మహర్దశ పట్టింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కృషితో మెదక్- సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారికి కేంద్రం గ్రీన్స్నిగల్ ఇచ్చింది. 134 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయనుంది. ఇందులో మెదక్ -సిద్దిపేట ఒక బిట్టుగా, సిద్దిపేట- ఎల్కతుర్తి వరకు రెండో బిట్టుగా రహదారిని విభజించారు. తాజాగా సిద్దిపేట-ఎల్కతుర్తి 63.64 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ. 578.85 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీచేసింది. మెదక్ నుంచి సిద్దిపేట వరకు 70 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.882 కోట్లు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో రానున్నట్టు సమాచారం. జాతీయ రహదారి మంజూరు కావడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైవే నిర్మాణంతో మూడు రాష్ర్టాలతో రోడ్ కనెక్టివిటి పెరిగి, జిల్లా అన్నివిధాలుగా అభివృద్ధి చెందడానికి దోహదం కానుంది.
సమైక్య రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురైన ఉమ్మడి మెదక్ జిల్లా స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని రోడ్లకు మహర్దశ వస్తున్నది. సీఎం కేసీఆర్ స్వయంగా పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతో పాటు ప్రధాని మోడీని కలిసి మెదక్- సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అనేక మార్లు కేంద్ర మంత్రులను కలిసి జాతీయ రహదారికి నిధులు తీసుకువచ్చారు.
సిద్దిపేట, జనవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మెదక్- సిద్దిపేట-ఎల్కతుర్తి వరకు ఉన్న 134 కిలోమీటర్ల రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. ఇం దులో మెదక్ -సిద్దిపేట ఒక బిట్టుగా, సిద్దిపేట- ఎల్కతుర్తి వరకు రెండో బిట్టుగా రహదారిని విభజించారు. తాజాగా సిద్దిపేట-ఎల్కతుర్తి 63.64 కిలోమీటర్ల రహదారికి విస్తరణకు రూ. 578.85 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీచేసింది. మెదక్ నుంచి సిద్దిపేట వరకు 70 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.882 కోట్లు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో రానున్నట్టు సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాకు జాతీయ రహదారి మంజూరు కావడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి కోసం ఎన్నో ఏండ్ల నుంచి ఈ ప్రాంత ప్రజలు కలలు కంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఆ కల సాధ్యమైంది. జాతీయ రహదారితో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందనున్నది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక పరంగా మరింతగా పురోగతి సాధించనున్నది. మెదక్ జిల్లా కేంద్రం నుంచి రామాయంపేట మీదుగా సిద్దిపేట నుంచి హుస్నాబాద్ మీదుగా ఎల్కతుర్తి వరకు రహదారి వెళ్తుంది. దీంతో అటు కరీంనగర్, ఇటు వరంగల్ నగరాలను కలుపుతుంది. ఈ రహదారికి ఇరువైపులా అభివృద్ధికి అడుగులు పడనున్నాయి. సాగు భూముల ధరలు పెరగనున్నాయి. రహదారిని ఆనుకుని ఉన్న పట్టణాలు విస్తరించి అభివృద్ధ్దిలో దూసుకు పోనున్నాయి.
రూ. 578.85 కోట్లు మంజూరు..
మెదక్ జిల్లా కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లాకేంద్రం మీదుగా ఎల్కతుర్తి వరకు రహదారిని విస్తరించి జాతీయ రహదారిగా మార్చడానికి నిధులు మంజూరు కావడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి మొత్తం 134 కిలోమీటర్లు విస్తరించి ఉంది. సిద్దిపేట-హుస్నాబాద్ మీదుగా కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి వరకు 63.64 కిలోమీటర్లు ఉంటుంది. సిద్దిపేట -ఎల్కతుర్తి రహదారి విస్తరణకు రూ. 578.85 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈనెల 18న ఉత్తర్వులను జారీచేసింది. ఈ రహదారిని విస్తరించి జాతీయ రహదారిగా మారుస్తారు. ఈ 63 కిలోమీటర్లలో 21.79 కిలోమీటర్లు అర్బన్ ఏరియాలో నాలుగు వరుసల రహదారిగా విస్తరించి, మురికి కాలువలు, మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి వీధిదీపాలు అమరుస్తారు. మిగిలిన 41.85 కిలోమీటర్ల మేర రహదారిని రూరల్ ఏరియాలో రెండు లైన్లుగా విస్తరిస్తారు. సిద్దిపేట రంగధాంపల్లి బ్రిడ్జి నుంచి ప్రారంభమవుతుంది. ఈ రహదారి విస్తరణలో భాగంగా 2 పెద్ద బ్రిడ్జిల నిర్మాణాలతో పాటుగా 26 మైనర్ బ్రిడ్జిలను నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిల్లో ఒకటి మైనర్, ఆరు బ్రిడ్జిలను మరమ్మతులు చేపట్టనున్నారు. పందిల్ల వద్ద టోల్ ప్లాజాను ఏర్పాటు చేయనున్నారు.త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి. జాతీయ రహదారి మం జూరు కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందనున్నది. ఇప్పటికే కాళేశ్వరం జలాలు వచ్చాయి. గతేడాది నుంచి చెరువులు, కుంటలు నిండుతున్నాయి. రైతులకు ఆ ఫలాలు అందాయి. త్వరలోనే రైల్వే లైన్ కల సాకారం కానున్నది. జిల్లాల ఏర్పాటు తర్వాత కొత్త రోడ్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయి.
మూడు రాష్ర్టాలకు రవాణా సౌకర్యం
ఎల్కతుర్తి-సిద్దిపేట హైవే నిర్మాణంతో ఛత్తీస్గడ్, తెలంగాణ, మహారాష్ట్రకు రవాణా సౌకర్యం మెరుగుపడుతున్నది. ఎల్కతుర్తి, సిద్దిపేట, రామాయంపేట, మెదక్ నుంచి నాందేడ్ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపగా, నిధులు మంజూరయ్యాయి. ఇందులో మొదటి విడుతలో ఎల్కతుర్తి-సిద్దిపేట వరకు సర్వే పూర్తయి నిధులు మంజూరు కావడం సంతోషంగా ఉంది. జాతీయ రహదారి మంజూరుకు కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్కు కృతజ్ఞతలు.
సీఎం కేసీఆర్ కృషి ఫలితం..
సీఎం కేసీఆర్, ఎంపీల కృషి ఫలితంగానే మెదక్-ఎల్కతుర్తి రహదారి విస్త్తరణకు నిధులు మంజూరయ్యా యి. జాతీయ రహదారి కావాలనే ఈ ప్రాంత ప్రజల కల సాకారమైం ది. ఇక్కడి ప్రాంత ప్రజలు ఎన్నో ఏండ్ల నుంచి దీనికి ఎదురు చూస్తున్నారు. జాతీయ రహదారి ఏర్పాటుతో వ్యాపార, వాణిజ్య పరంగా ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందనుంది. పెద్ద ఎత్తున పరిశ్రమలు రానున్నాయి. పక్క రాష్ర్టాలకు రవాణా సౌకర్యం సులభతరంగా కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలు వచ్చాయి. ఈ ప్రాంత రైతులకు ఆ ఫలాలు అందాయి. జాతీయ రహదారికి నిధులు మంజూరు కావడం సంతోషంగా ఉంది.
కల సాకారమైంది…
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే మెదక్ -ఎల్కతుర్తి రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. జాతీయ రహదారికి నిధులు మంజూరు చేయాలని మంత్రి హరీశ్ రావుతో పాటు తాను పలుమార్లు కేంద్ర మంత్రులను కలిశాం. జాతీయ రహదారి ఏర్పాటైతే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందడంతో పాటు పరిశ్రమలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఎట్టకేలకు కేంద్రం నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ రహదారి విస్తరణ పనులు ప్రారంభమవుతాయి.
సీఎం, మంత్రులకు కృతజ్ఞతలు
మెదక్ జిల్లా కేం ద్రం నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రం సెక్షన్ వరకు నేషనల్ హైవే (ఎన్హెచ్ 765డీజీ) రహదారి పనులకు రూ. 882.18 కోట్ల నిధులు మంజూరు చేయించిన సీఎం కేసీఆర్, సహకరించిన మంత్రి హరీశ్రావు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు. హైవే ద్వారా మెదక్ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రం వరకు రహదారిని విస్తరించి మొదటి దశ పనులు చేపట్టనున్నారు. రెండు జాతీయ రహదారులతో మెదక్ ప్రజలకు అత్యంత ప్రయోజనం కలుగుతుంది.