పీజీ పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎమ్ఎస్ డబ్ల్యూ, ఎంలిబ్ఐఎస్సీ, ఎంజేఅండ్ఎంసీ, ఎంకామ్ (ఐఎస్) తదితర కోర్సుల మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.
ఎంబీఏ పరీక్షల జవాబుపత్రం నకలు పొందేందుకు దరఖాస్తుల ఆహ్వానం
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షల జవాబు పత్రం నకలు పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంబీఏ రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పా రు. ఫలితాలను ఓయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జవాబు పత్రం నకలు పొందగోరేవారు ఒక్కో పేపర్కు రూ.1000 చొప్పున చెల్లించి వచ్చే నెల 18 లోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.
ఓయూ డిగ్రీ రివాల్యుయేషన్ ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
బీఏ, బీబీఏ, బీఎస్సీ, బీఎస్డబ్ల్యూ తదితర కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.