రఘునాథపాలెం, జనవరి 22: పల్లెల్లో వైద్య, గ్రామ పంచాయతీ సిబ్బంది జ్వర సర్వే బాట పట్టారు. ఇంటింటికెళ్లి జ్వర బాధితుల జాబితాను తయారు చేస్తున్నారు. జ్వరం ఉన్న వారికి మందులను అందిస్తూ.. వైద్య సలహాలు ఇస్తున్నారు. తీవ్రంగా జ్వరం, జలుబు, దగ్గు ఉన్న వారిని గుర్తించి కరోనా పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్గా నిర్ధారణ అయితే మందుల కిట్లు అందజేసి ఐసొలేషన్కు సిఫార్సు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న జ్వర సర్వే కరోనా బాధితులను గుర్తించడంతో పాటు ఇతరులకు వ్యాప్తి చెందకుండా జగ్రత్తలు పాటించడానికి సర్వే ఎంతో దోహదపడుతుంది.
మండలంలోని అన్ని గ్రామాల్లో మంచుకొండ పీహెచ్సీ వైద్య సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు శనివారం ఇంటింటికీ తిరుగుతూ ఫీవర్ సర్వే చేశారు. కోయచలక గ్రామంలో సర్పంచ్ మాదంశెట్టి హరిప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి శృతి, ఆశా కార్యకర్తలతో సర్వే చేయించారు. ఈ కార్యక్రమంలో వేపకుంట్లలో సర్పంచ్ ధారా శ్యాం, రఘునాథపాలెంలో గ్రామ కార్యదర్శి ప్రసన్నకుమార్, బిల్ కలెక్టర్ అంజయ్య, అంగన్వాడీ టీచర్లు పార్వతి, కవిత, ఉపవాణి, లక్ష్మి, నజ్మా తదితరులు పాల్గొన్నారు.