శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో తొలి ఒమిక్రాన్ కేసు గురువారం వెలుగుచూసింది. బ్రిటన్ నుంచి వచ్చిన మహిళ (35) కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆమెను నగరం లోని టిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జీనోమ్ సీక్వెన్సీ కోసం శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ప్రతి ఒక్కరు మాస్క్లు విధిగా ధరించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక జాగ్రత్తలతో కూడిన మార్గదర్శకాలను వైద్యశాఖ విడుదల చేయడం జరిగింది.