బోధన్, మే 5: టీఆర్ఎస్ సభ్యత్వం కలిగి ఆకస్మికంగా మృతిచెందితే.. బాధిత కుటుంబానికి పార్టీ బీమాతో అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బోధన్లోని ఆయన నివాసంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముగ్గురు మృతి చెందగా వారి కుటుంబీకులకు పార్టీ బీమాకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఎడపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన లంబాడి అశోక్, నవీపేట్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన గాండ్ల లక్ష్మణ్, హున్సా గ్రామానికి చెందిన భలేరావు నగేశ్ కుటుంబీకులకు రూ.రెండు లక్షల చొప్పున బీమా చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వర్రావు దేశాయ్, కౌన్సిలర్ డేగావత్ ధూప్సింగ్నాయక్, ఎడపల్లి ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, టీఆర్ఎస్ బోధన్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహ్మాన్, నాయకులు అబ్దుల్ వాసే, బీర్కూర్ శంకర్, మంద సంజీవ్, మందుగుల విద్యాసాగర్, రాజేందర్ రెడ్డి, పోల్క నర్సింహులుతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.