మెండోరా/ నిజాంసాగర్/ నాగిరెడ్డి పేట్/ఎడపల్లి (శక్కర్నగర్),, సెప్టెంబర్ 28 : మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్ ప్రాజెక్టులతోపాటు గోదావరి పరీవాహక ప్రాం తాల నుంచి ఎస్సారెస్పీలోకి 3,55,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోందని ఈఈ చక్రపాణి తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ 33 గేట్లు ఎత్తి దిగువకు 4,49,820 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091. 00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1088.90 అడుగుల (79.301 టీఎంసీలు) నీటి నిల్వ ఉందన్నారు. ని జాంసాగర్ ప్రాజెక్టులోకి 48,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో 11 గేట్ల ద్వారా 72,200 క్యూసెక్కుల నీటి ని మంజీరాలోకి విడుదల చేస్తున్నట్లు డీఈఈ శ్రావణ్కుమార్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1405.00 అడుగులు 17. 80 టీఎంసీలకు గాను 1403.47 అడుగులు 15.62 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. సింగూరు ప్రా జెక్టు నుంచి ఐదు గేట్ల ద్వారా 65590 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలిపారు. కౌలాస్నాలా ప్రాజెక్టులో (458.00 మీటర్లు 1.237 టీఎంసీలు) పూర్తిస్థాయి నీటితో నిండి ఉండగా, ఎగువ ప్రాతం నుంచి 4728 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని డీఈఈ దత్తాద్రి తెలిపారు. పోచారం ప్రాజెక్టులోకి 8292 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎడపల్లి మండలం అలీసాగర్ రిజర్వాయర్కు ఇన్ఫ్లో రావడంతో నీటిపారుదల శాఖ అధికారులు మంగళవారం మూడు గేట్లు ఎత్తి 18వందల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.