ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ విభాగంలో ఈ నెల 18, 19 తేదీలలో జాతీయ స్థాయి సింపోజియంను నిర్వహించనున్నట్లు విభాగం హెడ్ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
‘ఇన్నోవేటివ్ చాలెంజెస్ ఇన్ అప్లెడ్ యాస్పెక్ట్ ఆఫ్ జువాలాజికల్ సైన్సెస్ (ఎన్ఎస్ఐసీఏజడ్ఎస్)’పై నిర్వహించే ఈ సింపోజియంలో పరిశోధనా పత్రాలు సమర్పించదలచినవారు ఈ నెల 11వ తేదీలోగా తమ కార్యాలయానికి పంపించాలని సూచించారు.
సింపోజియం పట్ల ఆసక్తి ఉన్న వారు హాజరయ్యేందుకు ఈ నెల 16వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సింపోజియంలో పత్రాలు సమర్పించినవారికి బెస్ట్ ఓరల్ ప్రజెంటేషన్, బెస్ట్ పోస్టర్ ప్రజెంటేషన్ అవార్డులు సైతం అందజేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సింపోజియం సంయుక్త కార్యనిర్వాహక కార్యదర్శులుగా డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ ఏవీ రాజశేఖర్, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ సునీతాదేవి వ్యవహరిస్తారని చెప్పారు. ఇతర వివరాలకు 9848569309 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.