భూత్పూర్, ఏప్రిల్ 4: టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9నుంచి 11గంటల వరకు భూత్పూర్ వద్ద జాతీయ రహరదారిపై రాస్తారోకో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. రాస్తారోకోకు సంబంధించి సోమవారం స్థలాన్ని పరిశీలించారు. 5వేల మందితో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. రాస్తారోకోతో కేంద్ర ప్రభుత్వం దిగిరావాలని ఆయన కోరారు.