భగత్ అనే నేను..
నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా నోముల భగత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన గురువారం శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి చాంబర్లో ప్రమాణం చేశారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. సాగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు.
హైదరాబాద్కు తరలి వెళ్లిన నాయకులు, ప్రజాప్రతినిధులు
పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు
హాలియా, ఆగస్టు 12 : నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ గురువారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి చాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఏప్రిల్17న నాగార్జున సాగర్ శాసన సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో నోముల భగత్ విజయం సాధించారు. భగత్ చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, నల్లమోతు భాస్కర్రావు, గొంగిడి సునీత పాల్గొన్నారు. రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే భగత్కు అసెంబ్లీ రూల్స్బుక్, గుర్తింపు కార్డు అందించారు. నోముల భగత్కు రాష్ట్ర మంత్రులు, ్ల ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
భారీగా తలివెళ్లిన నాయకులు
ఎమ్మెల్యే నోముల భగత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, హాలియా మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మా శంకరయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ యడవల్లి నీలిమా మహేందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కురాకుల వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, కౌన్సిలర్లు ఉన్నారు.
నిడమనూరు : మండలం నుంచి తరలివెళ్లిన వారిలో ఎంపీపీ బొల్లం జయమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ కామర్ల జానయ్య, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, మండల పరిషత్ సలహాదారుడు బొల్లం రవియాదవ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పోలె డేవిడ్, నాయకులు మాచర్ల దాసు, వెంకన్న, పగిళ్ల శివ, శ్రీకాంత్ పాల్గొన్నారు.
పెద్దవూర : మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే భగత్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో డీవీఎన్ రెడ్డి, షేక్ అబ్బాస్, కర్ణ బ్రహ్మారెడ్డి , రవినాయక్, వాసుదేవుల సత్యనారాయణ రెడ్డి, షేక్ బషీర్, రావుల శ్రీను, కొట్టె రమేశ్, సైదులు యాదవ్, సయ్యద్ మియా, మదార్షా, అన్వరుద్దీన్ పాల్గొన్నారు.
గుర్రంపోడు : మండల కేంద్రంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. హైదరాబాద్కు తరలివెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్రావు, ఉపాధ్యక్షుడు వెలుగు రవి, సర్పంచులు షేక్ సయ్యద్మియా, షేక్ మదార్షా, బద్రి యాద య్య, చాడ చక్రవర్తి, ఆర్. వెంకటరమణరావు, పగిళ్ల లాల య్య, కుప్ప పృద్విరాజ్, షేక్ సిరాజ్, షేక్ జాకీర్, సురేశ్, రమేశ్ పాల్గొన్నారు.
త్రిపురారం : రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్నాయక్, నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి, మర్ల చంద్రారెడ్డి, రామచంద్రయ్య, పెద్దబోయిన శ్రీనివాస్యాదవ్ ఎమ్మెల్యేను కలిసి అభినందించారు.
తిరుమలగిరి (సాగర్) : టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య ఆధ్వర్యంలో సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పెద్ద తరలివెళ్లి ఎమ్మెల్యేను అభినందించారు.