స్వరాష్ట్రంలోనే బహుజనులకు గుర్తింపు వచ్చిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా దక్షతతోనే అది సాధ్యమైందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలో సర్ధార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌడ కులస్తుల అభ్యున్నతికి తోడ్పాటునందించేలా వైన్స్ కేటాయింపుల్లో 15 శాతం రిజర్వేషన్ ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. భువనగిరి మనందనం, నల్లగొండలో త్వరలో నీరా ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అందరివాడైన పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా జరిపేందుకు కృషి చేస్తామన్నారు.
చండూరు, సెప్టెంబర్ 24 : తెలంగాణ ఏర్పాటుతోనే బహుజనులకు గుర్తింపు వచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలో గౌడ సంఘం నాయకుడు వడ్డెపల్లి గోపాల్గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో అన్ని కులాలకు గుర్తింపు వచ్చిందన్నారు. గౌడ కులస్తులకు మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్లు వరమని పేర్కొన్నారు. తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తే వచ్చిన రూపా యి కాస్తా పన్నులు కట్టలేక సతమయ్యే రోజుల నుంచి అసలు పన్నులే లేని రోజులను నేడు చూ స్తున్నామన్నారు. గౌడ కులస్తుల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో 4 కోట్ల ఈత చెట్లను నాటామని తెలిపారు. నందనం, నల్లగొండ జిల్లాలో నీరా ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సర్వాయి పాపన్న చరిత్ర భావి భారత పౌరులకు తెలియజేసేందుకు యువత కృషి చే యాలని, పాపన్న ఫొటోలు గౌడ సోదరులు ఇం ట్లో పెట్టుకోవాలని పేర్కొన్నారు. బహుజనుల అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేశాడని, తెల్లవారికి వ్యతిరేకంగా పోరాటం చేసి 33 కులాలకు అధిపతిగా, 33 సంవత్సరాల పాటు రాజ్యాన్ని ఏలిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర భాకర్రెడ్డి, వంగాల స్వామి గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, జై గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకన్న, లక్ష్మణ్ గౌడ్, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, కళ్యాణీరవికుమార్, మాదగోని శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.