యాదాద్రి, అక్టోబర్ 20 : పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాతం చేపట్టారు. ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన జరిపారు. ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి, తులసీ పత్రాలతో అర్చన గావించారు. దర్శనమూర్తులకు సువర్ణపుష్పార్చన, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. బాలాలయంలోని మహామండపంలో సుదర్శన నారసింహ హోమం, విశ్వక్సేనారాధన, నిత్యతిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. రాత్రి ఆరగింపు చేపట్టిన అర్చకులు అనంతరం పవళింపు సేవ నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు రూ.7,44,665 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
సీఎం కేసీఆర్ పేరున పూజలు
యాదాద్రి ఆలయ ఉద్యోగులు సీఎం కేసీఆర్ పేరుతో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించినందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రమేశ్బాబు, ఆలయ అర్చకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 85,638
రూ.100 దర్శనం టిక్కెట్ 21,400
వేద ఆశీర్వచనం 3,612
సుప్రభాతం 4,200
క్యారీబ్యాగుల విక్రయం 1,650
టెంకాయల విక్రయం 21,000
వ్రత పూజలు 36,500
కల్యాణకట్ట టిక్కెట్లు 10,600
ప్రసాద విక్రయం 3,26,785
వాహన పూజలు 3,800
టోల్గేట్ 450
అన్నదాన విరాళం 15,383
సువర్ణ పుష్పార్చన 80,400
యాదరుషి నిలయం 38,100
పాతగుట్ట నుంచి 16,885