నిడమనూరు, ఏప్రిల్ 11 : తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు గుర్తింపు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఉపఎన్నికల మండల ఇన్చార్జి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మండలంలోని రేగులగడ్డ గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ వార్డు సభ్యుడు రమావత్ రాములుతోపాటు 30మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో 60 ఏండ్ల పాలనలో ఏ ప్రభుత్వాలూ చేయని మేలు సీఎం కేసీఆర్ మాత్రమే చేశారని అన్నారు. భగత్ను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో రేగులగడ్డ సర్పంచ్ జంగిలి రాములు, నాయకులు జాల పాపయ్య, గోపి, మల్లేశ్గౌడ్, సుధాకర్రెడ్డి, గోపాల్రావు పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే పేదల సంక్షేమం
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
పేదల సంక్షేమం టీఆర్ఎస్తోనే సాధ్యమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. నిడమనూరు మండలం వెంగన్నగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యుడు పొట్టెపాక శ్రీను, కార్యకర్తలు బల్లెం లక్ష్మణ్, కటారి హనుమంతు, ఊర శ్రీను, పొట్టెపాక శివ ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడిన పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. టీఆర్ఎస్వీ నాయకుడు బొమ్ము శివకుమార్, ఉప సర్పంచ్ నాగరాజు, అయోధ్య, మట్టయ్య పాల్గొన్నారు.
అభివృద్ధిని కొనసాగిద్దాం..
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
గుర్రంపోడు : సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలంటే భగత్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నల్లగొండ ఎమ్మెల్యే, ఎన్నికల మండల ఇన్చార్జి కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం కొప్పోలు, మొసంగి గ్రామాల నుంచి 350మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, నిడమనూరు మార్కెట్ చైర్మన్ కామర్ల జానయ్య, మాజీ జడ్పీటీసీ రవికుమార్, నాయకులు గజ్జెల చెన్నారెడ్డి, ఆవుల వెంకన్న, నగేశ్గౌడ్, సామల బొజ్జయ్య, సర్పంచులు భాస్కర్, కృష్ణప్రసాద్, జ్యోతీలింగారెడ్డి, ఎంపీటీసీ శ్రీకాంత్, అభినయ్యాదవ్, లింగయ్య పాల్గొన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలో విలేకరుల సమావేశం, పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్కు సీపీఐ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ మండల కార్యదర్శి రేపాక లక్ష్మీపతి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
కీరదోస తింటే 7 రోజుల్లో 7 కిలోల బరువు తగ్గుతారా?
సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే : మంత్రి హరీష్ రావు