మఠంపల్లి, జనవరి 30 : హుజూర్నగర్ నియోజవర్గంలో విద్యాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఓజో ఫౌండేషన్ చైర్మన్ రఘు అన్నారు. మండలంలోని వర్దాపురం గ్రామంలో పాఠశాలను సందర్శించి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ అల్లిపురం పాఠశాలలో నూతన భవానానికి ఫ్లోరింగ్, గ్రానైట్స్, బిల్యానాయక్తండా హైస్కూల్కు రూ.2లక్షలతో ఆట స్థలం, క్రీడా పరికరాలు, గ్రంథాలయానికి పుస్తకాలు, మఠంపల్లి యూపీఎస్ పాఠశాలకు రూ.40వేల విద్యుత్ బకాయి చెల్లించడంతో భవనానికి పెయింటింగ్, మఠంపల్లి గురుకుల స్కూల్లో రూ.లక్షతో అభివృద్ధి పనులు, మోడల్ స్కూల్ చుట్టూ కంప చెట్ల తొలగింపు, రూ.2లక్షలతో ఆట స్థలం, మరుగుదొడ్లు, మౌలిక వసతులు, సిమెంట్ బల్లాలు, వర్దాపురం పాఠశాలలో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పన గురించి తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే సమకూరుస్తామని చెప్పారు.
విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది
ఆంగ్ల బోధన అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ తప్పనిసరి. మన ఊరు.. మన బడి కార్యక్రమం పేద విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తుంది. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనతోపాటు ఉపాధ్యాయులు మెరుగైన బోధన అందించేందుకు తోడ్పడుతుంది.
చదువులన్నీ ఇంగ్లిష్తోనే ముడిపడి ఉన్నాయి..
సర్కార్ బడుల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం మంచి నిర్ణయం. ప్రస్తుతం ఉన్నత చదువులకు వెళ్లాలన్నా, ఏ ఉద్యోగం కావాలన్నా ఇంగ్లిష్తోనే ముడిపడి ఉన్నది. ప్రాథమిక స్థాయి నుంచి బోధన ఉంటే భవిష్యత్లో విద్యార్థులు ఎందులోనైనా రాణిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మన ఊరు.. మన బడి కార్యక్రమంతో పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చేరువవుతున్నది. పిల్లల
తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారం తప్పుతుంది.
పేద విద్యార్థులకు ప్రయోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు ఎక్కువగా చదువుతుంటారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. మన ఊరు.. మన బడి కార్యక్రమంతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయించడం సంతోషకరం. డబ్బులు కట్టి చదువుకోలేని పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది.