మోటకొండూర్/ గుండాల, జనవరి 30 : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మోటకొండూరు మండలంలోని అమ్మనబోలు గ్రామంలో అనంతారం నుంచి కిషన్గూడ వయా అమ్మనబోలు వరకు రూ.3.21కోట్లతో, గుండాల మండలంలోని రామారం నుంచి కొమ్మాయిపల్లి మీదుగా జీడికల్ వరకు రూ.2.41 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశా ల్లో ప్రభుత్వ విప్ సునీత మాట్లాడారు. సబ్బండ వర్గాల అభ్యున్నతికి సర్కారు కృషి చేస్తున్నదన్నారు. కరోనా ఆపత్కాలంలోనూ సంక్షేమ పథకాలను అందించామని తెలిపారు. వర్టూర్ నుంచి పెద్దబావి మీదుగా మాటూరు వరకు రోడ్డు మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించామని.. చాడ, ఇక్కుర్తి గ్రామాల నుంచి మండల కేంద్రానికి రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా గుండాల మండలానికి సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. అనంతారం గ్రామ చెరువును అశ్వరావుపల్లి కెనా ల్ ద్వారా నింపుతామని.. టంగుటూరు, మంతనపల్లి, గొలనుకొండ, శారాజీపేట వరకు సాగునీరు అందిస్తామని తెలిపారు. సుద్దాల-పల్లెపహా డ్ కాజ్వే విత్ బ్రిడ్జి పనులకు అదనంగా రూ.11 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అంతకుముందు అమ్మనబోలులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సునీతకు టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వాలు ఏవైనా అభివృద్ధే తమ లక్ష్యమని, నిధుల మంజూరుకు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీపీ తాండ్ర అమరావతి, జడ్పీటీసీ పల్లా వెంకట్రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీల్, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్గౌడ్, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, సర్పంచులు ఎం.విజితారమేశ్రెడ్డి, సిరిపురం నర్మద, ఎంపీటీసీలు సంగి అలివేలు, పోలెపల్లి జ్యోతిలక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు బొట్ల యాదయ్య, మహ్మద్ ఖలీల్పాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి బైరోజు వెంకటాచారి, నాయకులు పాల్గొన్నారు.