ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ
విద్యార్థుల సంఖ్య మేరకు పంతుళ్లు
యూడైస్ ఆధారంగా కార్యాచరణ
కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ
మార్గదర్శకాలు విడుదల
కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ
ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నది. యూడైస్ ఆధారంగా.. ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచబోతున్నది. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈవో, ఐటీడీఏ పీవో, డీఈవోతోజిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు కానున్నది. కరోనా కారణంగా మూతబడిన పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో ఇక బోధన పకడ్బందీగా సాగనున్నది.
నాగర్కర్నూల్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : విద్యాశాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నది. ఈ క్రమం లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండేలా చర్యలకు ఆదేశించింది. గతేడాది విద్యాశాఖ ఆధ్వర్యంలో యూడైస్ ఆధారంగా ఆ యా పాఠశాలల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయు ల సంఖ్యను గుర్తించారు.దీని ఆధారంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరగనున్నది. విద్యార్థులు అధికంగా ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి వారిని బదలాయించనున్నారు. కేవలం ఉపాధ్యాయుల సర్దుబాటే ప్రధాన ఉద్దేశం. విద్యార్థులు లేకున్నా ఒక ఉపాధ్యాయ పోస్టు మా త్రం కచ్చితంగా కొనసాగుతుంది. ఉపాధ్యాయ పో స్టులు రద్దు చేయడం, కొత్త పోస్టులను కల్పించడమనే అంశాలకు తావు లేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈవో, ఐటీడీఏ పీవో, డీఈవోలతో జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థులకు బోధనా సిబ్బంది పూర్తి స్థాయిలో అం దుబాటులో ఉండే అవకాశముంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణకు విద్యాశాఖ అధికారులు రంగం సిద్ధం చేశా రు. ఇప్పటికే ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు..? ఎన్ని పోస్టులు మంజూరయ్యా యి..? ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల సం ఖ్య..? ఎన్ని ఖాళీలున్నాయి..? అనే వివరాలు పొం దుపర్చనున్నారు. అవసరానికి మించి పోస్టులుంటే విద్యార్థులు ఎక్కువ ఉన్న స్కూళ్లకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే జాబితా రూపొందించనున్నా రు. ఉపాధ్యాయ హేతుబద్ధీకరణకు సీనియర్ ఉపాధ్యాయుడు అంగీకరించకుంటే జూనియర్ ఉపాధ్యాయుడిని ఇతర పాఠశాలకు బదలాయించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా బోధన జరగాలన్నదే ఉపాధ్యాయ హేతుబద్ధీకరణ ఉద్దేశం. నాగర్కర్నూల్ జిల్లాలో విద్యాశాఖ పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 825 ఉ న్నాయి. ఇందులో 70 వేల మంది వరకు విద్యార్థు లు ఉండగా, ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పం డితులు, సబ్జెక్ట్ ఉపాధ్యాయులు కలిపి 3,169 మం ది ఉన్నారు. ఇందులో 10 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 60 వరకు ఉన్నట్లు అంచనా.
ఇవీ మార్గదర్శకాలు..
ప్రాథమిక పాఠశాలల్లో 19 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, 60 మందికి ఇద్దరు, 90 మందికి ముగ్గురు, 120 మందికి నలుగురు, 150 మంది విద్యార్థులుంటే ఐదుగురు ఉపాధ్యాయులు ఉంటారు. 151 మించితే ఒక హెచ్ఎం, ఐదుగురు ఉపాధ్యాయులు ఉంటారు.
ప్రాథమికోన్నత పాఠశాలలో 6 నుంచి 8వ తరగతి వరకు వంద మంది విద్యార్థులకు గణితం, సైన్స్కు కలిపి ఒకరు, సోషల్ సైన్స్కు ఒకరు, లాంగ్వేజెస్కు ఒక్కొక్కరు చొప్పున నలుగురు ఉపాధ్యాయులు ఉంటారు. ఇందులో సీనియర్ ఉపాధ్యాయుడు హెచ్ఎంగా వ్యవహరిస్తారు.
101 నుంచి 140 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ ఉపాధ్యాయులతోపాటు ఐదుగురు, 175 మంది ఉంటే సైన్స్, గణితానికి ఇద్దరు చొప్పున ఆరుగురు, 210 మంది ఉంటే సైన్స్, గణితం ముగ్గురితోపాటు ఏడుగురు, 245 వరకు ఉంటే 8 మంది ఉపాధ్యాయులు, 280 మంది వరకు 9, 315 మంది ఉంటే 10, 350 మంది విద్యార్థులకు 11, 385 మంది వరకు 12 మంది ఉపాధ్యాయులు ఉంటారు.
ఉన్నత పాఠశాలలో 220 మంది విద్యార్థులకు ఒక హెచ్ఎంతోపాటు 9 మంది ఉపాధ్యాయులు ఉంటారు. అలాగే 400 మంది విద్యార్థులకు మించితే క్రాఫ్ట్ లేదా డ్రాయింగ్ లేదా సంగీతం ఉపాధ్యాయులు ఉంటారు. గణితం, ఫిజికల్ సైన్స్, బయో కెమిస్ట్రీ, ఇంగ్లిష్, సోషల్ సైన్స్, ప్రథమ, ద్వితీయ భాషా పండితులు ఉంటారు. విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుంది. 1,210 మంది విద్యార్థులుండే పాఠశాలల్లో 45 మంది వరకు ఉపాధ్యాయులు ఉండనున్నారు.
ఇంగ్లిష్ మీడియం కోసం ఏర్పాటు చేసే అదనపు సెక్షన్లకు 50 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులు ఉంటారు. ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య 420 మంది ఉంటే 8 మంది వరకు ఉపాధ్యాయులు ఉంటారు. ఎస్జీటీ పోస్టులను అవసరాన్ని బట్టి బదలాయించనున్నారు. ఇంగ్లిష్ మీ డియం విద్యార్థులు 50 కంటే తక్కువగా ఉంటే దగ్గరలోని పాఠశాలల్లో చేర్పించనున్నారు.
త్వరలో కలెక్టర్కు నివేదిక..
ప్రభుత్వ పాఠశాలల్లో బోధనను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్ల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నాం. జిల్లాలో ఇలా అవసరమైన ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ జాబితా తయారుచేస్తున్నాం. త్వరలో జిల్లా కలెక్టర్కు ఈ నివేదిక అందజేస్తాం. విద్యార్థి లేకున్నా ప్రతి పాఠశాలకు కచ్చితంగా ఒక ఉపాధ్యాయ పోస్టు ఉంటుంది. ఏ ఒక్క పోస్టును రద్దు చేయరు. విద్యార్థులకు సరిపడా బోధన సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకే హేతుబద్ధీకరణ ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.