పాలక మండలిలో కీలక నిర్ణయం
అలంపూర్, ఏప్రిల్ 17 : కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర పురాతత్వ శా ఖ ఆదేశాల మేరకు జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ క్షేత్రంలో 18వ తేదీ నుంచి భక్తుల దర్శనాలు నిలిపివేయనున్నట్లు ఆలయ పాలక మండలి చైర్మన్ రవి ప్రకాశ్గౌడ్, ఈవో ప్రేమ్కుమార్రావు తెలిపారు. శనివారం అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో పాలక మండలి సమావేశాన్ని ఈవో అధ్యక్షతన నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర పురాతత్వ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలను మూసివేయాలని వచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మే 15వ తేదీ వరకు భక్తులకు దర్శనభాగ్యం ఉండదన్నా రు. సమావేశంలో ఆలయ పాలక మండలి సభ్యులు నాగరాజు, వెంకట్రామయ్యశెట్టి, వసంత, ఎక్స్అఫీషియో మెంబర్ ఆనంద్శర్మ, అర్చకులు, సిబ్బంది ఉన్నారు.