ఇప్పటికే కొన్నది 4,82,179 మెట్రిక్ టన్నుల ధాన్యం
నేరుగా రైతుల ఖాతాలోనే జమ అవుతున్న డబ్బులు
రైతులకు చెల్లించినది రూ. 451 కోట్లు
ప్రతి సెంటర్కు ఒక ప్రత్యేకాధికారి నియామకం
ఎప్పటికప్పుడు అధికారులకు మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం
సిద్దిపేట, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర సర్కారు ఇచ్చిన మాట ప్రకారం వానకాలం ధాన్యం కొనేందుకు రైతుల వద్దనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నది. ఎప్పుడూ లేనంతగా ఈ సారి సాగు విస్తీర్ణం పెరిగింది. ధాన్యం కూడా అధికంగానే వస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 937 కేంద్రాలను ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు 4,82,179 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. రూ.451 కోట్లు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రైతుల డబ్బులను ఏ రోజుకారోజూ జమ చేస్తున్నది. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించి, కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూస్తున్నది. ఈ విషయంలో మంత్రి హరీశ్రావు ఎప్పటికప్పుడు కలెక్టర్లతో మాట్లాడుతూ, అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో కొనుగోలు చేయడంతో పాటు ట్యాబ్ ఎంట్రీ సజావుగా, వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతుల ఆధార్కార్డు, బ్యాంక్ ఖాతా తదితర వివరాలు కొనుగోలు సమయంలోనే సేకరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వానకాలం ధాన్యాన్ని రైతుల వద్దనే కేంద్రాలను ఏర్పా టు చేసి కొనుగోలు చేస్తున్నది. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లా లో 937 కేంద్రాలను మహిళా సంఘాలు, సహకార సంఘాలు, మార్కెట్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 4,82,179 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ.451 కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన రైతుల డబ్బులను ఏ రోజుకు ఆరోజు జమ చేస్తున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించి ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా చూస్తున్నారు. వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాల ఎప్పటికప్పుడు సందర్శించి ధాన్యం కొనుగోలు, ట్యాబ్ ఎంట్రీ, లోడింగ్, అన్ లోడింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పుడూ లేనంతగా ఈ వానకాలం సాగు విస్తీర్ణం పెరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలిగించే విధంగా పనిచేయడంతో మండిపడుతున్నారు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ చివరి గింజా వరకు కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడంపై రైతులు సంతోషంగా ఉన్నారు. మధ్య దళారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 937 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 937 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళా సంఘాల ద్వారా, సహకార సంఘాల ద్వారా, మార్కెట్ల ద్వారా ముమ్మరంగా ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలిస్తున్నారు. రైతులకు ధాన్యం అమ్ముడుపోయిన వారం రోజుల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో 402 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 38,933 మంది రైతుల వద్ద నుంచి 1,68,618 మెట్రిక్ టన్ను ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రూ.158 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మెదక్ జిల్లాలో 378 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 39,560 మంది రైతుల వద్ద నుంచి 2,23,560 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఈ జిల్లాలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.195 కోట్లు జమ చేశారు. సంగారెడ్డి జిల్లాలో 157 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 17,687 మంది రైతుల వద్ద నుంచి 90,001 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నారు. రూ.98కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఉమ్మడి జిల్లాలో 97,180 మంది రైతుల వద్ద నుంచి 4,82,179 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఉమ్మడి జిల్లాలో రూ.451కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ధాన్యం డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. అన్ని జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు ట్యాబ్ ఎంట్రీ వేగంగా జరిగేలా చర్య లు తీసుకుంటున్నారు. రైతుల ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా తదితర వివరాలు కొనుగోలు సమయంలోనే సేకరిస్తున్నారు.
పదిరోజుల కిందనే డబ్బులు పడ్డాయి
నాకు పది రోజుల కింద వడ్ల పైసలు బ్యాం కుల పడ్డాయి. రెండున్నర ఎకరాల్లో 70 క్వింటాళ్ల వడ్లు పండితే ముందు 40 క్విం టాళ్లు అమ్మిన. వాటి డబ్బులు వారం రోజుల్లో అకౌంట్ల పడ్డాయి. నాలుగు రోజుల కింద మరో 30 క్వింటాళ్ల వడ్లు అమ్మిన. వాటి డబ్బులు కూడా రేపోమాపో బ్యాంకుల పడుతాయి. కేంద్రాల్లో ఇబ్బందులు లేవు. వచ్చిన వడ్లను వచ్చినట్లు కొంటున్నారు. డ్యాం కింద వడ్లు తప్ప మాకు ఏమీ పండవు. వడ్లు కొంటనే మాకు న్యాయం జరుగతది.
-కొమ్ము శ్రీకాంత్, యువరైతు, లద్నూర్
వడ్లు కొన్న వెంటనే డబ్బులేస్తుండ్రు
కొనుగోలు కేంద్రా ల్లో వడ్లు కాంట అయిన వెంటనే బ్యాంకు అకౌం ట్ల డబ్బులు పడుతున్నా యి. నాకు రెండు రోజుల కింద డబ్బులు పడ్డాయి. కేంద్రాల్లో ఎలాంటి తక్లిబ్ లేకుండా కాంట పెడుతుండ్రు. గ్రామాల్లో సెంటర్లు పెట్టి సీఎం కేసీఆర్ సార్ పుణ్యం కట్టుకున్నాడు. గవర్నమెం ట్ వడ్లు కొనకపోతే ఎక్కడ అమ్ముకోవల్నో అర్థమైతలేదు.
-చల్లా హన్మంతారెడ్డి, రైతు, నర్సాయపల్లి