మహేశ్వరం: ఈనెల 21న మోడల్స్కూల్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ ధనుంజయ్ తెలిపారు. 6వతరగతి ప్రవేశాలకు ఉదయం 10గంటలనుండి 12 గంటల వరకు, 7,10వ తరగతి ప్రవేశాలకు 2గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు ప్రవేశపరీక్షలు నిర్వహించబడుతాయని ఆయన తెలిపారు. విద్యార్థులందరూ హాల్టికెట్ను డౌన్లోడ్ చేసుకొని పరీక్ష సమయానికన్నా ఒక గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.