గోల్నాక : పలు వ్యాధుల భారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
మంగళవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న కాచిగూడ డివిజన్ రహమత్నగర్కు చెందిన రాఘవేంద్రవర్మకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.3లక్షల విలువగల ఎల్ఓసీ ఆయన బాధితుడి కుటుంబసభ్యులకు అందజేశారు.