మహేశ్వరం : మహేశ్వరంలో నిర్మాణంలో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్ భవన నిర్మాణ పనులను మంత్రిసబితాఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా నాణ్యతతో కూడిన పనులను చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నామని ఆమె అన్నారు. ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు అంగోతు రాజునాయక్ పాల్గొన్నారు.