న్యాల్కల్, ఆగస్టు 16: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శంకర్ అన్నారు. సోమవారం మండలంలోని మిర్జాపూర్(బీ) గ్రామంలో ప్రజా ఆరోగ్య రక్షణ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు వార్డుల్లో వైద్య సిబ్బందితో కలిసి పర్యటించారు. ప్రస్తుత సీజన్లో డెంగీ, మలేరియా తదితర వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యాధులు సోకినట్లయితే వెంటనే దవఖానలకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. కొవిడ్ పరిస్థితుల దృష్టా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ ముఖానికి మాస్కులను ధరించాలన్నారు. అంతకుముందు మిర్జాపూర్(బీ) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వినియోగించుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను వైద్యాధికారులు, సి బ్బంది అందించాలన్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రసవాలు ప్రభుత్వ దవాఖాన లోనే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి ప్రశాంతి, సీహెచ్వో రవికుమార్, పురుషోత్తం, సిబ్బంది మల్లికార్జున్, శ్యామల, ముంతాజ్అలీ, యశోద తదితరులు పాల్గొన్నారు.
మల్గి గ్రామంలో డెంగీ, మలేరియా వ్యాధులతో పాటు సీజనల్ వ్యాధులపై ప్రజలకు ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. సోమవారం పలు వార్డుల్లో సర్పంచ్ మారుతీయాదవ్, ఎంపీటీసీ శివనంద శ్రీపతి, వైద్య సిబ్బంది పర్యటించి పరిసరాలను పరిశీలించారు. పలువురి ఇంటి ఆవరణలోని డ్రమ్ములో నిల్వ ఉన్న నీటిని ఖాళీ చేయించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిషన్రెడ్డి, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు, అంగన్వాటీ టీచర్లు పాల్గొన్నారు.