కౌడిపల్లి,ఆగస్టు 25: గ్రామాల్లో ప్రతి పాఠశాల పరిశుభ్రంగా ఉండాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నా రు. బుధవారం మండలంలోని సలాబత్పూర్, కన్నారం, ధర్మసాగర్ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు,పాఠశాలలను తనిఖీ చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పాఠశాలను శానిటైజేషన్ చేసి పరిశుభ్రంగా ఉంచాలన్నారు.వచ్చే నెల 1తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్నాయని సర్పంచ్లు, కార్యదర్శులు దగ్గర ఉండి శుభ్రం చేయించాలన్నారు. కార్యక్రమంలోఎంపీపీ రాజునాయక్, ఎంపీడీవో పాల్గొన్నారు.
రామాయంపేట, ఆగస్టు 25: ప్రభుత్వ పాఠశాలలు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభిస్తున్నామని మండల విద్యాధికారి బుచ్యానాయక్ అన్నారు. నిజాంపేట, రామాయంపేట మండలాలకు చెందిన ఆర్పీలతో సమావేశం ఏర్పా టు చేసి ఎంఈవో మాట్లాడారు.రెండు మండలంలోని ప్ర భుత్వ పాఠశాలలను శుభ్రంగా చేయడం కోసం ఈ నెల 30 చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు పాఠశాలల్లో ఉన్న కలుపు మొక్కలు తొలిగించి శానిటైజేషన్ చేయాలని ఆయా గ్రామాల సర్పంచ్లకు సమాచారం అందజేసినట్లు ఎంఈవో తెలిపారు.
తూప్రాన్/రామాయంపేట, ఆగస్టు 25: ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 30లోగా పరిశుభ్రంగా ఉండాలని లేకుంటే కలెక్టర్తో ఉపాధ్యాయులు నోటీసులు తీసుకోవాల్సి వస్తుందని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్గౌడ్, కమిషనర్ మోహన్ అన్నారు. మున్సిపల్లో ని వివిధ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి పారిశుధ్య కార్మికుల తో గడ్డిని తొలిగించారు. అనంత రం చైర్మన్, కమిషనర్ పాఠశాల లో ఉన్న ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు. సెప్టెంబర్ 1 న ప్రారంభమయ్యే పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందు లు లేకుండా ఉండాలన్నారు. పా ఠశాల గదుల్లో శానిటైజర్లు, మా స్క్లను కచ్చితంగా ఉంచాలన్నా రు. చైర్మన్ వెంట ఆర్ఐ రమేశ్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
చిలిపిచెడ్,ఆగస్టు 25: మండలంలోని ప్రతి పాఠశాలను శుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేక అధికారి దే వయ్య గ్రామ కార్యదర్శులకు సూచించారు. మండల కేంద్రంలో ఎంపీడీవో శశిప్రభ ఆధ్వర్యంలో ఆయా గ్రామ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలను శానిటైజేషన్ చేసి.. కలపు మొక్కలను తొలిగించే బాధ్యత కార్యదర్శులదే అ న్నారు. కార్యక్రమంలో ఎంపీవో పోలేశ్వర్రాజు, ఎంఈ వో చంద్రశేఖర్, ఏపీవో శ్యామ్కుమార్ పాల్గొన్నారు.
చేగుంట ఆగస్టు 25: ఉపాధ్యాయులు తప్పని సరిగా కొవిడ్ నిబందనలు పాటించాలని మండల విద్యాధికారి బుచ్చనాయక్ అన్నారు.నార్సింగిలో నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశంలో ఎంఈవో మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పని సరిగా మాస్క్లు ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నార్సింగి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానమాల,ఎస్ఎంసీ చైర్మన్ పాల్గొన్నారు.
వెల్దుర్తి, ఆగస్టు 25: సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలను తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయంతో వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలోని పాఠశాలలను సిద్ధం చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా పాఠశాలలు మూసి ఉండడంతో గ్రామపంచాయతీ సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. తరగతి గదులు శుభ్రం చేసి పూర్తిగా శానిటైజేషన్ చేస్తున్నారు.