మెదక్రూరల్,జనవరి14: భోగి సంబురాలు శుక్రవారం మెదక్ మండలం వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ప్రజలు వీధుల్లో భోగి మంటలు వేశారు. మహిళలు రంగురంగుల ముగ్గులు వేశారు. ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టారు. చిన్నా పెద్దా అనే తేడాలేకుండా పతంగులు ఎగురవేశారు.
ఘనంగా భోగి సంబురాలు
శివ్వంపేట, జనవరి 14 : శివ్వంపేట మండలం వ్యాప్తంగా భోగి సంబురాలు జరుపుకున్నారు. ఉదయం భోగి మంటలు వేశారు. మండలంలోని గూడురులో సర్పంచ్ స్వరాజ్యక్ష్మీశ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్ ఆధ్వర్యంలో భోగిమంటలు ఏర్పాటు చేశారు.మహిళలు అందమైన ముగ్గులు వేశారు. చిన్నారులు, యువకులు పతంగులు ఎగురవేశారు.
ముగ్గుల పోటీలు
కొల్చారం, జనవరి 14: మండల కేంద్రమైన కొల్చారంలో ఛత్రపతి యువసేన సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీల్లో విజేతలైన మహిళలకు ఎంపీపీ మంజుల బహుమతులు ప్రదానం చేశారు. ఎంపీటీసీ అరుణ, సర్పంచ్ ఉమ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరిశంకర్, వివిధ యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆర్ఎస్ఎస్ ఆధ్వర్వంలో ..
అల్లాదుర్గం,జనవరి14: టేక్మాల్ మండలం చల్లపల్లిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీ లు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మండల వ్యవస్థ ప్రముఖ్ ఎల్లంపల్లి మోహన్, జిల్లా బౌద్దిక్ ప్రముఖ్ తోట రవీందర్,శ్రీనివాస్,దుర్గేశ్,గోపాల్,సత్యం,మహేందర్ పాల్గొన్నారు.