యాసంగిలో అదనంగా 60 వేల ఎకరాల్లో పంట
మంత్రి హరీశ్రావు
నారాయణరావుపేట, ఏప్రిల్ 6 : కాళేశ్వరం నీళ్లతో వానకాలం కంటే యాసంగిలో అదనంగా 60 వేల ఎకరాల్లో అధికంగా పంట పండుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం గుర్రాలగొంది గ్రామంలో నిర్వహిం చిన రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కల్యా ణ మహోత్సవంలో మంత్రి పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ వానకాలం 2 లక్షల 20 వేల ఎకరా ల్లో అయితే.. కాళేశ్వరం జలాల రాకతో ఈ యాసంగిలో 2 లక్షల 80 వేల ఎకరాల్లో ధాన్యం పండిందన్నారు. రంగనాయకసాగర్ నీటితో పల్లెల్లోని చెరువులు, కుంటలన్నీ నిం డుకుండలా మారాయని తెలిపారు. రూ.10 లక్షలతో ఎల్లమ్మ దేవాలయానికి రావడానికి సీసీ రోడ్డు వేశామని, గ్రామాన్ని దత్తత తీసుకున్న రవీందర్ సహకారంతో రూ.3 లక్షలతో ఆలయాన్ని అభి వృద్ధి చేశామన్నారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు 5 ఎకరాల భూమి కేటాయించాలని మంత్రిని కోరగా త్వరలోనే ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మండుటెండల్లో గ్రామచెరువు మత్తడి దుంకుతున్నదని పేర్కొన్నారు.
కరోనాను నిర్లక్ష్యంగా తీసుకోవద్దు..
కరోనా వ్యాధి విస్తరణను ప్రజలు నిర్ల క్ష్యంగా తీసుకోవద్దు.. సెకండ్ వేవ్లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం సూచించిన కరోనా నిబంధనలు పాటించాలని, ఎల్లప్పు డు జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు.