పాపన్నపేట, జనవరి 30 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీమాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయలకు తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆల య ఈవో సార శ్రీనివాస్ తగిన ఏర్పాటు చేశారు. ఆదివారం జిల్లా ఫారెస్ట్ అధికారి రవిప్రసాద్ వనదుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
జాతరకు రూ.కోటి కేటాయింపుపై ఎమ్మెల్యే హర్షం
పాపన్నపేట, జనవరి 30 : త్వరలో జరిగే ఏడుపాయల వనదుర్గాభవానీమాత జాతరకు సీఎం కేసీఆర్ రూ.కోటి నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేయడంతో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఏటా జాతర నిర్వహణకు సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది కూడా జాతరను నిర్వహణకు రూ.కోటి నిధులు మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.