అంబర్పేట: బాగ్అంబర్పేట డివిజన్ సాయిబాబా టెంపుల్ రోడ్డు విస్తరణకు తగిన చర్యలు తీసుకుంటానని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. టెంపుల్ రోడ్డు విస్తరణ పై సాధ్యాసాధ్యాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొ రేటర్ బి.పద్మవెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ కె.పద్మావతిలతో కలిసి మేయర్ సోమవారం అధికారులతో చర్చించారు.
గుడి కమాన్ నుంచి ఆంధ్రాబ్యాంకు చౌరస్తా వరకు పర్యటించిన ఆమె రోడ్డును ఎంత మేరకు విస్తరించవచ్చని పరిశీలించారు. గుడి ముందు ట్రాఫిక్ రద్దీ ఎక్కువై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఏటీఐకి చెందిన కొంత స్థలాన్ని తీసుకొని రోడ్డును వెడల్పు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ విషయాన్ని మాజీ కార్పొరేటర్ కె.పద్మావతి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఈ మేరకు ఆమె సోమవారం పరిశీలనకు వచ్చారు. అంబర్పేట ఛే నెంబర్ లో ఫ్లెఓవర్ నిర్మాణం జరుగుతున్నది.
ఈ రోడ్డును విస్తరించి ప్రత్యామ్నాయ రోడ్డుగా రామాంతపూర్ వరకు వెళ్లేందుకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఏటీఐకి సంబంధించి 20 ఫీట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకొని మొత్తం 60 ఫీట్ల రోడ్డును వేయాలని చెప్పారు. ఈ విషయాన్ని అధికారులతో చర్చించిన తరువాత ఏటీఐకి చెందిన 20 ఫీట్ల స్థలం సేకరించడానికి చర్యలు తీసుకుంటామని మేయర్ చెప్పారు.
అనంతరం సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్గౌడ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చంద్రమోహన్, శ్రీరాములుముదిరాజ్, అరుణ్కుమార్రెడ్డి, శ్రీకాంత్, శివాజీయాదవ్, ఎం.ఎస్.రెడ్డి, బీజేపీ నాయకులు చుక్క జగన్, అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.