పసుపుల బ్రాంచి కెనాల్ డీ8, డీ5 కాల్వల విస్తరణకు ప్రభుత్వం ఆదేశం
సోమశిల-సిద్ధేశ్వరం వంతెన, జాతీయ రహదారి ఏర్పాటుతో మారనున్న కొల్లాపూర్ రూపురేఖలు
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి
కోడేరు, ఏప్రిల్ 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకంతో ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 150 మంది లబ్ధ్దిదారులకు కోడేరు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సోమవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే గతంలో అప్పులు చేయాల్సిన దుస్థితి ఉండేదని సీఎం కేసీఆర్ నేడు ఈ పథకాన్ని అమలు చేసి తొలగించారన్నారు. రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కానుందని గతంలో అటు ఇటుగా కాకుండా మార్చిన రెవెన్యూ వ్యవస్థపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు.
కోడేరు మండంలోని చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందనందున హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా పసుపుల బ్రాంచి కెనాల్ డీ8, డీ5 కాల్వలను విస్తరించి చివరి ఆయకట్టు రైతాంగానికి నీళ్లు అందేవిధంగా సత్వరచర్యలు తీసుకోవాలని సాగునీటిశాఖ అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. కాలువల విస్తరణతో త్వరలో మార్గం సుగమం కానుందన్నారు. సోమశిల-సిద్ధ్దేశ్వరం వంతెన కొల్లాపూర్ మీదుగా జాతీయ రహదారి ఏర్పాటుతో కొల్లాపూర్ రూపురేఖలు మారనున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా మామిడి మార్కెట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని, ట్రేడర్స్ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో విండో చైర్మన్లు చిన్నారెడ్డి, కృష్ణారెడ్డి, రుక్మారెడ్డి, టీసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, ప్రధాన కార్యదర్శి రాజవర్ధ్దన్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు జగదీశ్వర్రావు, స్థానిక సర్పంచ్ వెంకటస్వామి, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు పార్టీ అండదండలు
కోడేరు, ఏప్రిల్ 5: టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్ క్రీయాశీల సభ్యత్వం పొందిన కార్యకర్త మృతిచెందాడు. పార్టీ నుంచి మంజూరైన రూ.2లక్షల బీమా చెక్కును సోమవారం శారదమ్మ కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో టీసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్గౌడ్, రాజవర్ధ్దన్రెడ్డి, స్థానిక సర్పంచ్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.