వడ్డేపల్లి, ఏప్రిల్ 5 : మండు టెండను సైతం లెక్కచేయకుండా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరుతున్నారు. ఆకలి, దప్పికలు లెక్కచేయకుం డా దేవుని కావడీలు మోస్తూ భజనలు చేస్తూ మల్లికార్జున స్వామి దర్శనానికి భారీగా తరలుతున్నారు.అయితే ప్రతిఏడాది భక్తుల సాకర్యార్థం ఆయా గ్రామాల్లో దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహి స్తూ, మందులు , మజ్జిగ ప్యాకెట్లు అందించేవారు. కానీ ఈ ఏడాది దాతలు ముందుకు రాకపోవడంతో వడ్డేపల్లి, రాజోళి, మానవపాడు మండలాల్లో పాదయాత్ర భక్తులకు ఎలాంటి వసతులు కల్పించలేకపోయారు. దీంతో కాలినడక భక్తులు దారి వెంట బావుల్లో స్నానాలు చేస్తూ, అలసిపోయి కంపచెట్లల్లో, రోడ్డు పక్కన ఆదమరచి నిద్రపోతున్నారు. కొంతమంది కాళ్లకు కర్రలు కట్టుకొని నడుస్తున్నారు. మండల కేంద్రాల్లో పాదయాత్ర భక్తులకు ఆరోగ్య శిబిరాలు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.