ఉమ్మడి జిల్లాలో పలువురికి జెడ్పీ సీఈవోలుగా, డీఆర్డీవోలుగా ప్రమోషన్లు
మహబూబ్నగర్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలువురు జెడ్పీ డిప్యూటీ సీఈవోలకు పదోన్నతి లభించింది. జెడ్పీ సీఈవోలుగా, మరికొందరు డీఆర్డీవోలుగా పదోన్నతి పొందారు. వీరందరికీ వివిధ జిల్లాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది మంది అధికారులకు పదోన్నతులు లభించాయి.
-జెడ్పీ డిఫ్యూటీ సీఈవో యాదయ్యకు మహబూబ్నగర్ డీఆర్డీవోగా పదోన్నతి.
-జెడ్పీ డిఫ్యూటీ సీఈవోగా ఉన్న ఎం.జ్యోతి మహబూబ్నగర్ జెడ్పీ సీఈవోగా పదోన్నతి.
-నారాయణపేట డిఫ్యూటీ సీఈవో సిద్ధిరామప్పకు పేటలోనే జెడ్పీ సీఈవోగా పదోన్నతి.
-మహబూబ్నగర్ డీఆర్డీవో వెంకట్రెడ్డికి వనపర్తి జెడ్పీ సీఈవోగా పదోన్నతి.
-వనపర్తి జెడ్పీ డిఫ్యూటీ సీఈవోగా ఉన్న పి.నర్సింహులుకు వనపర్తి డీఆర్డీవోగా పదోన్నతి
-వికారాబాద్ జెడ్పీ డిఫ్యూటీ సీఈవో బి.ఉషకు నాగర్కర్నూల్ జెడ్పీ సీఈవోగా పదోన్నతి.
-జెడ్పీ డిఫ్యూటీ సీఈవోగా ఉన్న నర్సింగ్ రావుకు నాగర్కర్నూలు డీఆర్డీవోగా పదోన్నతి .
-జెడ్పీ డిఫ్యూటీ సీఈవోగా ఉన్న డి.వినయ్ నాయక్కు జోగుళాంబ గద్వాల జెడ్పీ సీఈవోగా పదోన్నతి.