గేట్లు తీసిన కాల్వలకు నీళ్లు రావడం లేవు
నీళ్లు తక్కువ ఉన్నందున విడుదల అసాధ్యం
ఇరిగేషన్ ఈఈ సంజీవ్ ప్రసాద్
మక్తల్ టౌన్, ఏప్రిల్ 5 : చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్ లో గేట్లు తీసినా కాల్వలకు నీళ్లు అందడం లేవని ఇరిగేషన్ ఈఈ సంజీవ్ ప్రసాద్ అన్నారు. పట్టణంలోని ఇరిగేషన్ కా ర్యాలయంలో సోమవారం ఇరిగేషన్ ఈఈ మాట్లాడుతూ కాల్వ మట్టం కన్నా నీళ్లు తక్కువ ఉన్నందున నీటి విడుదల అసాధ్యమని, రిజర్వాయర్ గురించి కొందరు వ్యక్తులు అనవసరంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చిట్టెం నర్సిరె డ్డి రిజర్వాయర్ అసలు నిల్వ సామర్థ్యం 3.313 టీఎంసీలని, అందులో రిజర్వాయర్ కొంత ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నందున ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 2.80 టీఎంసీలన్నారు. వానకాలం కృష్ణానది ఇన్ఫ్లో సమయంలో 60 రోజులు మక్తల్ మండలంలోని గోప్లాపూర్ ఎ త్తిపోత్తల నుంచి 2.8 టీఎంసీల నీటిని రిజర్వాయర్లోకి నింపుతామన్నారు. వానకాలంలో 90 రోజలు కాల్వల ద్వా రా సాగునీటి విడుదల సాధ్యమవుతున్నదన్నారు. ఎండకాలంలో ఇన్ఫ్లో ఉండకపోవడంతో నీటి సామర్థ్యం తక్కువ ఉన్నందున విడుదల అసాధ్యమని, అత్యవసర సమయం లో నీరు విడుదల చేసినా తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం గేట్లు తీసినా కాల్వలకు నీరు అందించలేమని సంజీవ్ ప్రసాద్ తెలిపారు. రిజర్వాయర్పై అవగాహన లేక కొందరు వ్యక్తులు అధికారులపై అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం నీటి మట్టం ఒక టీఎంసీ కన్నా తక్కువగా ఉందని సంజీవ్ ప్రసాద్ తెలిపారు.