కాచిగూడ : గత ప్రభుత్వాలు చేయలేని అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ పేద ప్రజలకోసం ప్రవేశపెట్టి వారి జీవనోపాధిని మెరుగుపర్చాడని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నెహ్రు నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవించిన మహిళలకు గురువారం కేసీఆర్ కిట్టును ఎమ్మెల్యే కాలేరు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవించిన గర్భిణి స్త్రీలకు రూ.14 వేల రూపాయల నజరానను సీఎం ప్రకటించడం పేద మహిళలకు దేవుడిచ్చిన వరం లాంటిదని ఆమె పేర్కొన్నారు. 60 ఏళ్లలో లేని అభివృద్ది ఏడేండ్ల లోనే చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వముదని, హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అవిరళంగా సీఎం కృషి చేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు.
ఎవరెన్ని విమర్శలు గుప్పించినా తెలంగాణలోని పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. సమగ్రమైన అభివృద్ది, స్వచ్ఛమైన పాలన, చిత్తశుద్ది, పట్టుదల ఉన్న వ్యక్తిని సీఎం కేసీఆర్లో చూస్తున్నామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం మెడికల్ అఫీసర్ పి.మమత, పరమేశ్వర్, విక్కీ, సునీత, సాయి,మాజీ గోల్నాక అధ్యక్షుడు భరత్ముదిరాజ్, కాలేరు రామకృష్ణ, మధుసూదన్రెడ్డి, కాలేరు రాజు, పి.సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.