అమాంతం పెరిగిన చికెన్ ధరలు
దేశీ కోళ్లకు మంచి డిమాండ్
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ : నిర్మల్ జిల్లాలో కోడి ధర కొండెక్కింది. మహారాష్ట్రలో లాక్డౌన్ విధించ డానికి తోడు బర్డ్ ఫ్లూ భయంతో వ్యాపారులు కోళ్ల పెంపకానికి ముందుకు రాకపోవడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. పౌల్ట్రీ ఫాంలో కిలోకు రూ.142, రిటైల్లో రూ.164, స్కిన్తో రూ. 236, స్కిన్లెస్తో రూ. 271 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక దేశీ కోడి కిలోకు నిన్నా మొన్నటి దాకా రూ.350 ఉండగా, ప్రస్తుతం రూ.460 పలుకుతున్నది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మున్ముందు మరింత ప్రియమయ్యే అవకాశమున్నది.
ఇవి కూడా చదవండి..
రమ్యకృష్ణను ఏడిపించిన సీనియర్ హీరోయిన్ రేఖ