సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంపీటీసీల క్షీరాభిషేకం
అధికారుల ప్రమేయం లేకుండా సర్పంచులు నిధుల వినియోగంపై హర్షం
నారాయణపేట రూరల్, మార్చి 30 : మండల సర్వస భ్య సమావేశం సాదాసీదాగా సాగింది. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి వైస్ ఎంపీపీ సుగుణ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు హాజరయ్యారు. ముందుగా సీఎం కేసీ ఆర్ గ్రామ పంచాయతీల్లో పనులు చేపట్టడానికి నిధులు వినియోగానికి ఏ అధికారుల అనుమతి లేకుండా గ్రామ తీ ర్మానాల ద్వారా సర్పంచులు నేరుగా నిధులు ఖర్చు చేసేందుకు అనుమతి ఇవ్వడంపై సర్పంచులు హర్షం వ్యక్తం చేశా రు. అలాగే ఎంపీటీసీలకు బడ్జెట్లో నిధులు కేటాయించ డంపై సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించా రు. సమావేశంలో వివిధ సమస్యలను సర్పంచులు, ఎంపీ టీసీలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు సం బంధించి డబ్బులు త్వరగా రాని కారణంగా కూ లీలు సక్రమంగా పనులకు రావడం లేదని అధికారులు చొరవ తీసుకోవాలని ప్రజాప్రతినిధులు కోరారు. మండల పరిషత్ కార్యాలయానికి సం బంధించి వివిధ పనులకు గానూ రూ.3 లక్షలు వివిధ పద్దుల కింద చెల్లించాల్సి ఉన్నదని, ఈ చె ల్లింపులకుగానూ వెంటనే నిధులు విడుదల చే యాలని సీఈవోకు విన్నవించారు. పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, అదే విధంగా పలు చోట్ల పైప్లైన్ వేయలేదని సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో సందీప్కుమా ర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.