పాన్గల్, సెప్టెంబర్ 28 : వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రైతును రాజు చేయడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, వనపర్తి జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతువేదిక భవనంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మహాజన సభను విండో చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి అ ధ్యక్షతన నిర్వహించగా.. ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ యాసంగిలో రైతులకు విండో ద్వా రా రూ.11 కోట్ల రుణాలను ఇవ్వడం శు భపరిణామన్నారు. పంట పెట్టుబడి నుం చి కొనుగోలు వరకు ప్రభుత్వం అండగా ఉంటూ వారిని ప్రోత్సహిస్తున్నదని చె ప్పారు. అంతేకాకుండా కనీస మద్దతు ధర చెల్లించి దళారుల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. వ్యవసాయం అంటే దండుగకాదు పం డుగ అనే రోజులు వచ్చాయని, రానున్న రోజుల్లో రైతులకు ఎంతో మేలు చేకూరనున్నదని తెలిపారు. సంప్రదాయ పంట ల సాగు కాకుండా ప్రత్యామ్నాయ పం టల వైపు దృష్టి సారించాలని వారు పిలుపునిచ్చారు. రసాయనిక ఎరువులు వాడడంవల్ల పొలాలు పాడైపోతున్నాయని, సేంద్రియ ఎరువులు వాడితే మన నేల ల్లో బంగారం పండించవచ్చని సూచించారు. ఆధునిక టెక్నాలజీని వినియోగిం చి అధిక దిగుబడులు సాధించాలన్నారు. అదేవిధంగా పాలెం వ్యవసాయ సైంటిస్టులు డాక్టర్లు విజయ, సుజాత, మహేశ్వరమ్మ, ప్రత్యూష పంటల సాగు, తెగు ళ్ల నివారణ, ఆయిల్సీడ్స్ పంటల సా గుపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం సింగిల్విండో చేపట్టిన రూ. 2.50 కోట్ల వ్యవసాయ రుణాలకు సం బంధించిన రుణమేళా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశంలో జెడ్పీకోఆప్షన్ సభ్యుడు మునీరొద్దీన్, ఎంపీపీ శ్రీధర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వెంకటయ్య నాయుడు, విండో వైస్ చైర్మన్ బాల య్య, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి సుధాకర్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి అనిల్కుమార్, తాసిల్దార్ చక్రపా ణి, మాజీ జెడ్పీటీసీ రామ్మూర్తి నాయు డు, ఎంపీటీసీలు కర్ణాకర్రెడ్డి, కృష్ణ, డైరెక్టర్లు జైపాల్రెడ్డి, ప్రసాద్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, నాయకులు చంద్రశేఖర్నాయక్, వీరసాగర్, జ్యోతినందన్రెడ్డి, రామకృష్ణ తదితరులు ఉన్నారు.