మహబూబ్నగర్, సెప్టెంబర్ 22 : దివ్యాంగులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకట్రావు అన్నా రు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో బుధవారం దివ్యాంగులకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ప్రతినెలా చివరి బుధవారం దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఖాళీగా ఉన్న 25 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేశామన్నారు. ఇకపై ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామన్నారు.అలాగే ప్రైవేట్ సంస్థల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తమ పరిధిలో లేని వాటిని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. సదరం క్యాంపులను సీనియర్ అధికారులతోపాటు రెండోస్థాయి అధికారులు కూడా తనిఖీ చేస్తార ని, ఎట్టి పరిస్థితిలోనూ దళారులను ఆశ్రయించొద్దని సూచించారు. ఎవరైనా తప్పుడు సదరం సర్టిఫికెట్ తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్వాడీ పోస్టుల భర్తీలో దివ్యాంగులకు వయస్సు మినహాయింపు విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగుల నుంచి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు.
పనుల్లో నాణ్యత పాటించాలి
ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని సమవేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం మంజూరు చేసిన పనులు సకాలంలో చేపట్టడంతోపాటు, పురోగతిలో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రూ.10లక్షల కంటే ఎక్కువ వ్యయంతో చేపట్టే పనులకు సంబంధిత సమ్మిళిత అధికారులు సమావేశాలు నిర్వహించి పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సీబీఎఫ్, పల్లెప్రగతి, సీడీపీ, ఎంపీ ల్యాండ్ తదితర పనులపై కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణ, పంచాయతీరాజ్ ఈఈ నరేందర్, డీఈ రాములు తదితరులు ఉన్నారు.
పాఠశాల తనిఖీ
మహబూబ్నగర్టౌన్, సెప్టెంబర్ 22 : జిల్లా కేం ద్రంలోని మోడ్రన్ స్కూల్ను కలెక్టర్ వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒకటి, రెండోతరగతి గదుల ను పరిశీలించారు. ఒక్క విద్యార్థి కూడా మాస్కు ధరించకపోవడాన్ని చూసిన కలెక్టర్.. మాస్కులు తెప్పించి స్వయంగా విద్యార్థులకు కట్టారు. రెండోతరగతి విద్యార్థులకు ఆరుబయట పరీక్ష నిర్వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులను ఆరుబయట కూ ర్కోపెట్టొద్దని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్వెంట అర్బన్ ఎంఈవో జయశ్రీ, ప్రిన్సిపాల్ దత్తు, పీఈటీ విలియమ్స్ ఉన్నారు.