జడ్చర్లటౌన్, జనవరి 16 : పట్టణాలు, పల్లెల్లో సంక్రాంతి సంబురాలను ఘనంగా జరుపుకొన్నారు. మూడురోజులపాటు భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. మకరసంక్రాంతి పర్వదినం సందర్భంగా ఇంటి ముంగిళ్లల్లో వేసి న రంగువల్లులు అందరినీ ఆకట్టుకున్నాయి. పిల్లలు పతంగులు ఎగురవేశారు. బాదేపల్లి రంగనాయకస్వామిగుట్ట వద్ద ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. ము న్సిపాలిటీలోని విద్యానగర్కాలనీలో సంస్కారభారతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. మర్రిచెట్టుతండాలో గిరిజన మహిళలు ఊరేగింపుగా తరలివచ్చి స్థానిక ఆం జనేయస్వామి ఆలయంలో అభిషేకం చేశారు. అదేవిధంగా ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. పలు గ్రా మాల్లో యువతకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. మండలంలోని మల్లెబోయిన్పల్లి నిర్వహించిన కబడ్డీ పోటీల్లో శ్యామగడ్డతండా మొదటిస్థానంలో, పెద్దపల్లి జట్టు రెండోస్థానంలో నిలిచాయి. కార్యక్రమంలో సింగిల్విండో మాజీ చైర్మన్ పెరుమాళ్ల రాంరెడ్డి, సురేందర్రెడ్డి పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, జనవరి 16 : మండలంలోని మసిగుండ్లపల్లి, వాడ్యాల్, వేముల, వల్లభురావుపల్లి, బోయిన్పల్లి, కొత్తూర్, కొత్తపల్లి, చిల్వేర్ తదితర గ్రామాల్లో సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు. మిడ్జిల్లోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో మహిళలకు ఆలయ కమిటీ సభ్యులు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. అలాగే ఎడ్లబండ్లు, వాహనాలతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాధికారెడ్డి, నాయకులు సు ధాబాల్రెడ్డి, సంపత్కుమార్, వెంకట్రెడ్డి, రాజేశ్వర్, కరుణాకర్రెడ్డి, గంజి శేఖర్, అల్వాల్రెడ్డి, యాదయ్య, గౌస్, శంకర్, తిరుపతి, పాండు, వెంకట్రెడ్డి, ఆచారి, శ్రీనివాసులు, జహంగీర్ పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, జనవరి 16 : మండలంలో సం క్రాంతి పర్వదినాన్ని కనులపండువగా జరుపుకొన్నా రు. హజిలాపూర్లో సర్పంచ్ బుచ్చారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. గుడిబండలో రైతుబంధు స మితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, సర్పంచ్ ఎద్దుల జ్యోతి ఆధ్వర్యంలో యువతకు కబడ్డీ, వాలీబాల్ పో టీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, జనవరి 16 : మండలంలోని జానంపేటలో గంగారంగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద గ్రామస్తులు ఎడ్లబండ్లు, వాహనాలతో ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మ న్ వెంకటేశ్వర్రెడ్డి, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ నక్క ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, జనవరి 16 : మండలంలోని అన్ని గ్రా మాల్లో సంక్రాంతి సంబురాలను ఘనంగా జరుపుకొన్నారు. అమిస్తాపూర్, గోప్లాపూర్ గ్రామాల్లో ఆంజనేయస్వామి ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరిం చి శకటోత్సవం నిర్వహించారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు తదితర వాహనాలతో ఆలయాల చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి పూజలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీ నివాస్రెడ్డి, రామకృష్ణ, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, సా యిలు, సత్యనారాయణ, రామునాయక్, వెంకటేశ్ పా ల్గొన్నారు. అదేవిధంగా మద్దిగట్ల గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ కదిరె అశోక్రెడ్డి, సర్పంచ్ ప్రియాంకారెడ్డి, సింగిల్విండో డైరెక్టర్ రాంరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఉపసర్పంచ్ శేఖర్, నర్సింహారెడ్డి, చెన్న య్య, శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
బహుమతులు ప్రదానం
మూసాపేట(అడ్డాకుల), జనవరి 16 : మండలంలోని కన్మనూరులో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ విజేతలకు జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. టోర్నీలో వెల్టూర్ జట్టు విజతగా నిలిచినట్లు తెలిపారు. అలాగే చిన్నమునగల్చేడ్లో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు జెడ్పీటీసీ బహుమతులు అందజేశారు. మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లిలో సర్పంచ్ సాయిరెడ్డి ముగ్గు ల పోటీలను నిర్వహించారు. విజేతలకు మూసాపేట జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ స్థానిక నాయకులతో కలిసి బహుమతులు అందజేశారు. అలాగే మండలస్థాయి కబడ్డీ పోటీలను టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్రెడ్డి, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ ప్రారంభించగా, కొమిరెడ్డిపల్లి జట్టు విజేతగా, మూసాపేట రన్నర్గా నిలిచాయి.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల రూరల్, జనవరి 16 : మండలంలోని కుర్వగడ్డపల్లి, నసుర్లాబాద్, పెద్ద ఆదిరాల తదితర గ్రామా ల్లో క్రికెట్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతు లు ప్రదానం చేశారు. కార్యక్రమాల్లో సర్పంచుల సం ఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్చందర్, సర్పంచ్ సుందర్రెడ్డి, భైరంపల్లి వెంకటేశ్, శ్రీశైలం, ఉపసర్పంచ్ చెన్నకేశవులు, వెంకటేశ్, ఆంజనేయులు, కరీం, విజయ్రెడ్డి, భాస్కర్రెడ్డి, బాలస్వామి, శేఖర్, అంటో ని, ప్రవీణ్చందర్, ఉపసర్పంచ్ నరేందర్, కురుమూర్తి, అశోక్సాగర్, శ్రీనుయాదవ్, వెంకటేశ్సాగర్, మల్లేశ్, అమర్నాథ్రెడ్డి, శివశంకర్, వేణు పాల్గొన్నారు.
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
మహబూబ్నగర్టౌన్, జనవరి 16 : క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పలువురు అన్నారు. స్వామి వివేకానంద జయంతి, సంక్రాంతి పండుగ సం దర్భంగా ఎదిరలో వాలీబాల్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే బోయపల్లిలో పొటేళ్లతో బండ్లు లాగే పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమాల్లో కౌన్సిలర్ మోతీలాల్, మాజీ కౌన్సిలర్ శివశంకర్, సూద నర్సింహులు, హన్మంతు, అబ్దుల్హకీం, ప్రతాప్రెడ్డి, వెంకటయ్యగౌడ్, అజీజుల్లా, ఎల్లయ్య, సత్యం, కృష్ణ, శ్రీనివాసులు, భానుచందర్, జీ.రాములు, శ్రీనివాస్రెడ్డి, చంద్రశేఖర్, శేఖర్, బీకే.రాములు, టీ.రాములు, శ్రీ కాంత్, మల్లేశ్, పాషా, తిరుపతయ్య, నారాయణ, పత్తి వెంకట్రాములు, శరత్చంద్ర, వినోద్, బుచ్చారెడ్డి, నాగిరెడ్డి, రాములు, సత్యం, బాలరాజుగౌడ్ పాల్గొన్నారు.
మాంసం దుకాణాలు కిటకిట
జడ్చర్లటౌన్, జనవరి 16 : కనుమ పండుగ సందర్భంగా జడ్చర్ల పట్టణంలోని మాంసం దుకాణాలు కిటకిటలాడాయి. ఒకవైపు కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మాంసం దుకాణాలవద్ద కొవి డ్ నిబంధనలను ఎవరూ పాటించలేదు. గుంపులుగుంపులుగా గుమ్మిగూడి మాంసాన్ని కొనుగో లు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు మాంసం మార్కెట్కు చేరుకొని కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు.