వరంగల్, ఏప్రిల్ 12: వరంగల్ మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ప్రగతి పథంలో వరంగల్ మహానగరం’ సావనీర్ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 నుంచి 2021 మార్చి వరకు మహానగరంలో చేసిన అభివృద్ధ్ది, సంక్షేమ పనుల వివరాలు పొందుపరిచి సావనీర్ను అద్భుతంగా తయారు చేశారన్నారు. ఐదేళ్లలో రూ.1450 కోట్లు వెచ్చించి, చేపట్టిన పనుల వివరాలు చిత్రాలతో సహా వివరించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మంత్రులు, చీఫ్విప్తోపాటు మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
వరల్డ్ క్లాస్ ప్లేయర్ను పక్కనపెడతారా? ఇది సరైంది కాదు!
అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత