భూపాలపల్లి, ఏప్రిల్ 3 : ఈపీ ఆపరేటర్(ట్రెయినీ) డ్రైవింగ్ ప్రొవిషియె న్సీ టెస్టు నిర్వహణపై శనివారం సా యంత్రం తన కార్యాలయంలో జీఎం నిరీక్షణ్రాజ్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఈపీ ఆపరేటర్(ట్రెయినీ)డ్రైవింగ్ పరీక్షలకు కంపెనీ వ్యాప్తంగా 1662 మంది కంపెనీ ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో భూపాలపల్లి ఏరియా నుంచి 179 మంది సంస్థ ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. వీరికి ఈ నెల 5, 6వ తేదీల్లో స్థానిక అంబేద్కర్ స్టేడియంలో డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జీఎం ఆదేశించారు. సమావేశంలో ఏజీఎం(ఈఅండ్ఎం) రామలింగం, డీజీఎం(సివిల్) సత్యనారాయణ, ఏ వసంత్ ఎస్ఈ (ఐఈడీ), మహ్మద్ షరీఫ్ (సెక్యూరిటీ ఆఫీసర్), అనిల్ కుమార్ (పీఎం) పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
ఆన్లైన్ విమర్శకుల్ని అరెస్టు చేస్తున్న సైన్యం
16, 17 ఏండ్ల వయసు వారిపై జాన్సన్ & జాన్సన్ టీకా ట్రయల్స్