అమరచింత, అక్టోబర్ 17 : మండలంలోని సింగంపేట గ్రామంలో దసరా సందర్భంగా ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు రెండ్రోజులుగా కొనసాగుతున్నాయి. మొత్తం 54 టీంలకు గానూ ఆదివారం సాయంత్రం వరకు 40 టీంలకు పోటీలు నిర్వహించారు. మిగిలిన 14 టీంలకు నిర్వాహకులు ఫ్లడ్లైట్ల వెలుతురులో పోటీలు ఏర్పాటు చేశారు. అమరచింత ఎస్సై ప్రవీణ్కుమార్, టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లాల మాజీ అధ్యక్షుడు నరేశ్రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాము ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. న్యాయనిర్ణేతలుగా వడ్డెన్న, శ్రీనివాసులు, రామన్గౌడ్, హన్మిరెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు నారాయణ, మణ్యం, హరీశ్ పాల్గొన్నారు.